మరికాస్త ఉపశమనం: ఐదో రోజూ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: గత నెలరోజులకుపైగా వరుసగా పెరిగిన పెట్రో ధరలు ఐదు రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కాస్త దిగిరావడంతో వరుసగా ఐదో రోజూ దేశంలో ఇంధన ధరలు తగ్గాయి. దీంతో వినియోగదారుడికి మరికాస్త ఊరట లభించినట్లయింది.
వాహనదారులకు శుభవార్త: వరుసగా 4వ రోజు తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర 30పైసలు తగ్గి రూ. 81.34గా ఉంది. డీజిల్ కూడా 27పైసలు తగ్గి లీటర్ ధర రూ. 74.92గా ఉంది. ధరలు అత్యధికంగా ఉండే ముంబైలో కూడా ఇంధన ధరలు కాస్త తగ్గాయి. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 30పైసలు తగ్గి రూ.86.91గా ఉంది. డీజిల్ ధర 28పైసలు తగ్గి రూ.78.54గా ఉంది.
అక్టోబర్ 4న ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో రూ.91.34కు చేరిన విషయం తెలిసిందే. గత ఐదు రోజుల్లో పెట్రోల్పై రూ.1.39పైసలు, డీజిల్పై 80పైసల వరకు తగ్గింది. అక్టోబర్ 5వ తేదీన ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించడంతో పెట్రోల్, డీజిల్ ధరపై రూ.2.50 వరకూ తగ్గింపు లభించింది.