మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజీల్ ధరలు, నాలుగేళ్ళ తర్వాత అత్యధికం
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజీల్ ధరలు మళ్ళీ పెరిగాయి. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలను పురస్కరించుకొని ఇంత కాలం పాటు పెట్రోల్, డీజీల్ ధరలు పెరగలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికలు ముగిసిన రెండు రోజులకే పెట్రోల్, డీజీల్ ధరలు మరోసారి పెరిగాయి. సుమారు 19 రోజుల తర్వాత ఈ ధరలు పెరిగాయి.
సోమవారం నాడు లీటర్ పెట్రోల్ ధర రూ. 17 పైసలు పెరిగింది. డీజీల్కు లీటర్కు రూ. 21 పైసలు పెరిగింది. దీంతో రికార్డు స్థాయిలో ఈ రెండింటి దరలు పెరిగినట్టు అయిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర నాలుగేళ్ళ ఎనిమిది మాసాల తర్వాత అత్యధిక ధరను నమోదు చేసినట్టైందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

డీజీల్ ధర లీటర్కు రూ. 66 కు చేరుకొంది. డీజీల్ ధర కూడ ఆల్టైం హైకి చేరుకొంది. కోల్కత్తాలో లీటరుక5 పైసలు, ముంబైలో 23 పైసలు, చెన్నైలో 23 పైసలు డీజీల్ కు పెరిగింది. కోల్కతాలో 18 పైసలు, ముంబైలో 17 పైసలు, చెన్నైలో లీటర్ కు 18 పైసలు పెట్రోల్ పై ధరలు పెరిగాయి.
పెరిగిన ధరల ప్రకారంగా ఢిల్లీలో పెట్రోల్ లీటర్ కు రూ. 74.8, కోల్ కత్తాలో రూ.77.5, ముంబైలో రూ.82.5, చెన్నైలో రూ.77.61లకు చేరుకొంది,. లీటర్ డీజీల్ ధర ఢిల్లీలో రూ.66.14, కోల్కత్తాలో లీటర్ డీజీల్ కు 68.68. ముంబైలో రూ. 70.43, చెన్నైలో లీటర్ డీజీల్ రూ. 69.79 చేరుకొంది.
-
యుద్ధ భారం వాహనదారులు మోయక తప్పదా? -
వాహనదారులపై మరో బాదుడు గ్యారెంటీ -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications