మరోసారి : పెట్రోలుపై 42 పైసలు, డీజిల్పై రూ.1.03 పైసలు పెంపు
పెట్రోలు, డీజిల్ ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్పై లీటరుకు 42 పైసలు, డీజిల్పై లీటరుకు రూ.1.03 పైసలు చొప్పున పెరిగాయి.
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. పెట్రోల్పై లీటరుకు 42 పైసలు, డీజిల్పై లీటరుకు రూ.1.03 పైసలు చొప్పున పెరిగాయి. పెరిగిన ధరలు ఆదివారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు తెలిపాయి.
అవసరం లేదు: డిజిటల్ చెల్లింపులు చేసేవారికి కేంద్రం తీపికబురు
గత రెండు వారాల్లో అంటే, ఈ ఏడాదిలో ధరలు పెరగడం ఇది రెండోసారి. ఈ పెంపుతో ఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.70.60 నుంచి రూ.71.13కి పెరిగింది. లీటరు పైన 42 పైసలే పెరిగిన వ్యాట్తో కలిసి 53 పైసలు అయింది. డీజిల్ ధర రూ.57.82 నుంచి రూ.59.02కు పెరిగింది. వ్యాట్తో కలిపితే డీజిల్ ధర లీటరుపై రూ.1.20 పెరిగింది.
అంతకుముందు, జనవరి 1 పెట్రో ఛార్జీలు పెరిగాయి. అప్పుడు పెట్రోల్ ధర లీటరుకు రూ.1.29 పైసలు, డీజిల్ ధర లీటరుకు 97 పైసలు పెంచారు. పెరిగిన ధరలు ఆ రోజు (ఆదివారం) అర్థరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి.