సిగ్గుచేటు: రోడ్డు పక్కన గోడపై మూత్రం చేస్తూ చిక్కిన మంత్రి!
జైపూర్: రాజస్థాన్లో అధికార భారతీయ జనతా పార్టీపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారణ ఏమంటే.. ఆ రాష్ట్రానికి చెందిన ఆరోగ్యశాఖా మంత్రి కాళీచరణ్ షరాఫ్.. పింక్ సిటీగా పేరున్న జైపూర్ గోడలపై మూత్రం పోయడమే.
ఈ ఫొటోలు ఇప్పుడు నెట్లో వైరల్ మారడంతో ప్రతిపక్షాలతోపాటు నెటిజన్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో కార్యక్రమాలు చేపడుతుంటే.. రాష్ట్ర మంత్రి ఇలాంటి పని చేస్తారా? అంటూ మండిపడుతున్నారు.
ఓ వైపు స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం కింద జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛత దేశంలోనే అగ్రభాగాన ఉండేందుకు కృషి చేస్తుంటే.. బాధ్యత గల మంత్రి చేసిన పని సిగ్గుచేటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ ప్రవేశపెట్టిన పథకాలు ఆ పార్టీ మంత్రులే నీరుగారుస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కాగా, జైపూర్లో రోడ్డు పక్కల మూత్రం పోస్తే రూ. 200 జరిమానా కూడా విధిస్తున్నారు.