వేడి నీటితో సరిపెట్టిన మోడీ: ప్లీజ్ తినండని ఒబామాతో..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సోమవారం రాత్రి ఇచ్చిన విందులో భారత ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆయనకు వైట్హౌజ్ ఘనస్వాగతం పలికింది. అయితే ఆయన నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఉపవాసం ఉంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీ అధ్యక్షుడి విందులో కేవలం వేడి నీటిని మాత్రమే తీసుకున్నారు.
తను ఉపవాసంలో ఉన్నానని చెప్పిన మోడీ.. దయచేసి మీరు డిన్నర్ చేయండని ఒబామాను, ఇతర మంత్రులు, ప్రతినిధులను కోరారు. ఈ మేరకు వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులు వెల్లడించారు.

ప్రోటోకాల్ ప్రకారం విందు సందర్భంగా మోడీ ముందు ఓ ప్లేటు పెట్టారు. అయితే మోడీ మాత్రం ఓ గ్లాసులోని వేడి నీటిని సేవించారు. ప్రతీ ఏడాది నవరాత్రుల సందర్భంగా ఎంతో కఠినంగా ఉపవాసం చేసే మోడీ ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నారు. అందువల్లే ఆయన ఆహారం ఏమి తీసుకోకుండా నీటిని మాత్రమే తాగారు. ప్రస్తుతం ఆయన ఉపవాసం ఆరు రోజులకు చేరుకుంది.
ఆ విందులో మాంసాహారంతోపాటు శాకాహారన్ని కూడా ఏర్పాటు చేశారు. చేపలు, క్యారెస్ సాస్, అవకాడలు, మేక జున్ను, రోటీ క్రిస్ప్, లాంటి చాలా రకాల వంటకాలను అక్కడ ఉంచారు. మాంసాహారం సేవించేవారి కోసం కాలిఫోర్నియా వైట్ వైన్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications