polling day: 4భాషల్లో మోదీ అభ్యర్థన -రికార్డు స్థాయిలో ఓట్లేయాలంటూ ప్రధాని పిలుపు
మినీ సంగ్రామంగా భావిస్తోన్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంత ఎన్నికల్లో అతికీలకమైన పోలింగ్ ప్రక్రియ నేడు ప్రశాంతంగా కొనసాగుతున్నది. వేటికవే ప్రత్యేక సంస్కృతులు, భాషలు కలిగిన ఈ నాలుగు ప్రాంతాల ప్రజలను ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక సందేశమిచ్చారు.
నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రజలు ఓటుహక్కును వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పిలుపునిచ్చారు. తమిళనాడు, కేరళ, యూటీ పుదుచ్చేరి అసెంబ్లీకి ఒకే విడతతో ఎన్నికలు జరుగుతుండగా, బెంగాల్లో మూడో విడత, అసోంలో చివరి విడత ఎన్నికల పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది.

ప్రజలు పోలింగ్కు కేంద్రాలకు తరలివచ్చి రికార్డు స్థాయిలో ఓట్లు వేయాలని, ముఖ్యంగా యువ ఓటర్లు ముందుండాలని ట్విట్టర్ ద్వారా పిలుపునిచ్చారు. ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని కోరారు. ఈ మేరకు ప్రధాని బెంగాలీ, మలయాళం, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో ఆయన ట్వీట్లు చేశారు.
దేశవ్యాప్తంగా 475 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులో 234, కేరళలో 140, పుదుచ్చేరిలో 30, తుది విడతలో అసోంలో 40, బెంగాల్లో మూడో విడతలో 31 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications