PM Modi: బెంగాల్ మాదే..! మమతకు మోడీ మే4 వార్నింగ్..!
పశ్చిమబెంగాల్లో తొలిదశ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో రెండో దశ ప్రచారంలో పాల్గొంటున్న ప్రధాని మోడీ (PM Modi).. ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. తొలి దశ ఎన్నికలు జరిగిన తీరు చూస్తే తామే గెలువబోతున్నట్లు ఆయన తేల్చేశారు. మే 4 ఎన్నికల ఫలితాల తర్వాత పశ్చిమ బెంగాల్లో అధికార పార్టీ 'గూండాలకు' దాక్కోవడానికి చోటు ఉండదని, వారిని ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు.
మే 4న బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రాష్ట్ర ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి, ప్రతి దురాగతానికి సంబంధించిన ఫైళ్లను తెరుస్తామని ప్రధాని మోడీ తెలిపారు. మొదటి దశ పోలింగ్లో అధిక సంఖ్యలో ఓటర్లు పాల్గొనడం ప్రజాస్వామ్య విజయమన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు ఉన్న బలమైన విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తుందని మోడీ తెలిపారు. ఈ భారీ భాగస్వామ్యం ప్రజలను ఆందోళనకు గురిచేసిందని, ఇది మార్పు కోసం ప్రజల ఆకాంక్ష పెరుగుతోందని సూచిస్తోందన్నారు.

పశ్చిమ బెంగాల్, తమిళనాడు ప్రజలకు ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. బెంగాల్లో మనం చూస్తున్న మార్పుల పవనాన్ని, అక్కడి మొదటి దశ ఎన్నికల పోలింగ్ ధృవీకరించిందన్నారు. నిన్న బీజేపీకి లభించిన మద్దతే ఆ పార్టీ విజయానికి సంకేతం అన్నారు.














Click it and Unblock the Notifications