ఆర్మీ వాహనం ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..
జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లాలో ఆర్మీ వాహనం లోయలో పడిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 10 మంది సైనికులు ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వీర సైనికుల సేవలు భారత్ గుర్తుపెట్టుకుంటుందని అన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి అన్ని విధాలుగా సాయం చేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఎమోషనల్ పోస్టు చేశారు.
జమ్మూ కాశ్మీర్ లోని దోడా జిల్లా ఖన్నీ టాప్ వద్ద ఆర్మీ వాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి లోయలో పడింది. దాదాపు 200 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో 10 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు సైనికులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన సైనికులకు ఉదంపూర్ మిలిటరీ ఆస్పత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఘటన జరగడంపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.
Deeply anguished by the mishap in Doda, in which we have lost our brave army personnel. Their service to the nation will be remembered forever. May the injured recover at the earliest. All possible support is being provided to those affected.
— Narendra Modi (@narendramodi) January 22, 2026
అయితే తాజాగా దోడాలో జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ఈ ప్రమాదంలో మన ధైర్యవంతమైన సైన్యాన్ని కోల్పోయామని తెలిపారు. వారి సేవలను ప్రధాని మోదీ కొనియాడారు. గాయపడిన వారికి అన్ని రకాలుగా సేవలు చేస్తామని ట్వీట్ చేశారు.

ఇక ప్రమాద సమయంలో వాహనంలో 17 మంది సైనికులు ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. మంచు ఎక్కువగా కురుస్తుండటంతో రోడ్డును అంచనా వేయలేకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
-
కియారా బికీనీ వివాదం రీ ఓపెన్.. వర్మ మాటలతో మళ్లీ రచ్చ! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి..












Click it and Unblock the Notifications