ట్రంప్ కు మోడీ మరో ఝలక్.. ! ఆసియాన్ పై కీలక నిర్ణయం..!
రష్యా చమురు కొనుగోలు చేస్తున్నామనే కారణంతో భారత్ పై 50 శాతం సుంకాలు విధించిన ట్రంప్ కు ప్రధాని నరేంద్ర మోడీ సందర్భం వచ్చినప్పుడల్లా ఝలక్ లు ఇస్తూనే ఉన్నారు. ఓవైపు ఫోన్ కాల్స్ లో మాట్లాడుతున్నా.. మరోవైపు నేరుగా కలిసి చర్చలు జరిపేందుకు మాత్రం విముఖత చూపుతున్నారు. అదే సమయంలో సుంకాల తగ్గింపు విషయంలో ట్రంప్ సానుకూల సంకేతాలు పంపుతున్నా వాటిని మోడీ నమ్మడం లేదు. ఈ విషయం మరోసారి రుజువైంది.
తాజాగా ఈజిప్ట్ లో గాజా ఒప్పందం కోసం జరిగిన శాంతి సదస్సుకు రావాలని నేరుగా ట్రంప్ ఆహ్వానించినా వెళ్లకుండా దూరంగా ఉండిపోయిన ప్రధాని మోడీ.. ఇప్పుడు ఈ వారాంతంలో మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో జరిగే ఆసియాన్ సదస్సుకు కూడా దూరంగా ఉండాలని నిర్ణయించారు. దీనికి పరోక్ష కారణం ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరవుతుండటమే అని తెలుస్తోంది. దీంతో ఈ సదస్సుకు వర్చువల్ గా హాజరు కావాలని మోడీ నిర్ణయించారు.

Had a warm conversation with my dear friend, Prime Minister Anwar Ibrahim of Malaysia. Congratulated him on Malaysia’s ASEAN Chairmanship and conveyed best wishes for the success of upcoming Summits. Look forward to joining the ASEAN-India Summit virtually, and to further…
— Narendra Modi (@narendramodi) October 23, 2025
ఈ మేరకు స్వయంగా ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. "నా ప్రియమైన స్నేహితుడు, మలేషియా ప్రధాన మంత్రి అన్వర్ ఇబ్రహీంతో హృదయపూర్వక సంభాషణ జరిగింది. మలేషియా ASEAN అధ్యక్షత వహించినందుకు ఆయనకు అభినందనలు... ASEAN-భారత్ శిఖరాగ్ర సమావేశంలో వర్చువల్గా పాల్గొనడానికి మరియు ASEAN-భారత్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేయడానికి ఎదురుచూస్తున్నాను" అని ప్రధాని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు.

पिछले कई दिनों से अटकलें चल रही थीं कि प्रधानमंत्री मोदी कुआलालंपुर सम्मेलन में जाएंगे या नहीं? अब यह लगभग तय हो गया है कि प्रधानमंत्री वहाँ नहीं जाएंगे।
— Jairam Ramesh (@Jairam_Ramesh) October 23, 2025
इसका मतलब है कि कई विश्व नेताओं से गले मिलने, फ़ोटो खिंचवाने और ख़ुद को विश्वगुरु बताने के कई मौक़े हाथ से निकल गए।
पीएम… pic.twitter.com/LK3uB8SjWF
కరోనా సమయంలో మినహాయిస్తే రెగ్యులర్ గా ఆసియాన్ సదస్సులకు హాజరయ్యే ప్రధాని మోడీ.. ఈసారి మాత్రం ఏ కారణం లేకుండానే గైర్హాజరు అవుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్ ను చివరి సారిగా ప్రధాని మోడీ వాషింగ్టన్ కు వెళ్లి కలిశారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు కలుసుకోలేదు. ట్రంప్ కు దొరకడం ఆయనకు ఇష్టం లేదని, అందుకే ఇలా ఆయన హాజరయ్యే కార్యక్రమాలకు మోడీ వెళ్లడం లేదని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ ఆరోపించారు. భారత్-పాకిస్తాన్ యుద్దం ఆపానని ట్రంప్ 53 సార్లు, రష్యా చమురు భారత్ కొనడం ఆపేస్తుందని ఐదుసార్లు చెప్పుకున్నారని, ఇప్పుడు ఆయన్ను కలిస్తే మోడీ వీటిపై వివరణ ఇవ్వాల్సి వస్తుందని జైరాం రమేశ్ తెలిపారు.
-
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
హార్ముజ్ స్ట్రెయిట్ పై కన్నేసిన ట్రంప్- నాటోపై రుసరుస -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
తన గొయ్యి తానే తీసుకుంటున్న ట్రంప్..?? -
డ్రగ్స్ ఎంపీ పుట్టా మహేష్ పై కాంగ్రెస్ ట్వీట్- మోడీకి లింక్ చేస్తూ..! -
ట్రంప్కు మిత్రదేశాల బిగ్ షాక్! -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..!












Click it and Unblock the Notifications