గాంధీ, వాజ్పేయికి నివాళులర్పించిన మోడీ
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజార్టీ సాధించిన నరేంద్రమోడీ రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సాయంత్రం 7గంటలకు రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో మోడీ గురువారం ఉదయం మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని వాజ్పేయ్లకు నివాళులర్పించారు. అమిత్ షాతో కలిసి తొలుత రాజ్ ఘాట్కు చేరుకున్న ఆయన.. మహాత్మాగాంధీకి అంజలి ఘటించారు. అనంతరం అటల్ బిహారీ వాజ్పేయి సమాధి వద్దకు వచ్చి నివాళులు అర్పించారు.
గాంధీ, వాజ్పేయిలకు నివాళులర్పించిన అనంతరం నరేంద్రమోడీ నేషనల్ వార్ మెమోరియల్ను సందర్శించారు. అమర జవాన్లకు నివాళులు అర్పించారు. నేషనల్ వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచిన అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. బీజేపీ నేత నిర్మలాసీతారామన్, ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబా, ఎయిర్ఫోర్స్ వైస్ చీఫ్ మార్షల్ ఆర్ కే ఎస్ బహదురాయ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications