'ఒక చాయ్ వాలా.. మరో చాయ్ వాలాతో'.. వీడియో వైరల్
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్నారు. పర్యటనలో భాగంగా భారత్ కు చెందిన యువ పారిశ్రామికవేత్త అఖిల్ పటేల్ స్వయంగా తయారుచేసిన టీ ను ఆస్వాదించారు. ఆయనతోపాటు.. బ్రిటన్ ప్రధాని కీవ్ స్టార్మర్ కూడా టీ ను సేవించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. చెకర్స్ లో మోదీ, కీవ్ స్టార్మర్ తో చాయ్ పే చర్చా.. భారత్- యూకే సంబంధాలు బలంగా ఉన్నాయి అని క్యాప్షన్ ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
पीएम मोदी की, UK पीएम से चाय पे चर्चा…
— BJP (@BJP4India) July 25, 2025
चाय असम की और मसाला केरल का...😋😍 pic.twitter.com/6RcmziTc4M
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం యూకే పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే అక్కడ తాజాగా ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. బ్రిటన్ ప్రధాని కీవ్ స్టార్మర్ తో కలిసి చెకర్స్ లో విరామ సమయంలో మోదీ చాయ్ ను ఆస్వాదించారు. అయితే ఆ చాయ్ ను భారత సంతతికి చెందిన యువ పారిశ్రామికవేత్త అఖిల్ పటేల్ స్వయంగా తయారుచేశారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశాక ఇరు దేశాల అధినేతలు ఇలా చాయ్ ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
భారత్, యుకే మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) ఎంతో చారిత్రాత్మకమైనదిగా ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఇరుదేశాలకు ప్రయోజనకరమైన ఈ వాణిజ్య ఒప్పందంపై గురువారం సంతకాలు చేశారు. ఈ డీల్ వల్ల భారత్ నుంచి యూకేకు జరిగే దాదాపు 99 శాతం ఎగుమతులపై సుంకాలను తొలగించడం లేదా తగ్గించడం జరుగుతుంది. దీని వల్ల భారత్ కు అధిక ప్రయోజనం చేకూరనుంది. వీటిల్లో వస్త్రాలు, తోలు, పాదరక్షలు, క్రీడా వస్తువులు, బొమ్మలు, సముద్ర ఉత్పత్తులు, రత్నాలు, ఆభరణాలు, ఇంజినీరింగ్ వస్తువులు, ఆటో విడిభాగాలు, ఇంజిన్లు, సేంద్రీయ రసాయనాలు వంటి రంగాలకు ప్రయోజనం ఉండనుంది.

ఇక అంతేకాక ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారతదేశ మత్స్య రంగానికి ముఖ్యంగా ఏపీ, ఒడిశా, కేరళ, తమిళనాడు లాంటి తీరప్రాంత రాష్ట్రాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. యూకేలో ప్రస్తుతం 4.2 శాతం నుంచి 8.5 శాతం వరకు రొయ్యలు, టూనా చేపలు, మాంసంపై సుంకాలు ఉన్నాయి. ఈ ట్రేడ్ డీల్ తర్వాత ఈ ఉత్పత్తులు ఎలాంటి సుంకం లేకుండా యూకే మార్కెట్ లోకి వెళ్తాయి. అలాగే యూకే నుంచి దిగుమతి చేసుకునే కార్లు, విస్కీ, వైద్య పరికరాలు భారతదేశానికి చౌక ధరలకు దొరుకుతాయి.
-
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!! -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..?












Click it and Unblock the Notifications