భారత్ లో పట్టాలెక్కేది ఇట్లాంటి బుల్లెట్ రైలే
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం జపాన్ లో పర్యటిస్తోన్నారు. నేటితో ఆయన పర్యటన ముగుస్తుంది. అక్కడి నుంచి ఆయన నేరుగా చైనాకు బయలుదేరి వెళ్తారు. ఏడు సంవత్సరాల తర్వాత మోదీ చైనాలో అడుగు పెట్టబోతోండటం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు గ్ఝి జిన్ పింగ్ తో ముఖాముఖి సమావేశం కానున్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సభ్య దేశాల సమావేశానికీ హాజరవుతారు.
జపాన్ పర్యటనలో భాగంగా అక్కడి బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ ను పరిశీలించారు ప్రధాని మోదీ. తన కౌంటర్ పార్ట్ షిగేరు ఇషిబాతో కలిసి బుల్లెట్ రైలులో ప్రయాణించారు కూడా. కొత్తగా పట్టాలెక్కిన ALFA-X train ఇది. రాజధాని టోక్యో నుంచి సెండాయ్ మధ్య రాకపోకలు సాగించడానికి జపాన్ ప్రభుత్వం దీన్ని నడిపిస్తోంది.

ఇందులో టోక్యో నుంచి సెండాయ్ వరకు బుల్లెట్ రైలులో ప్రయాణించారు మోదీ. దీని పనితీరు, గరిష్ఠ వేగం, మెయింటెనెన్స్, నిర్వహణకు అయ్యే ఖర్చు.. వంటి అంశాలపై ఆరా తీశారు. భారత్ లో అహ్మదాబాద్- ముంబై మధ్య ప్రవేశపెట్టదలిచిన బుల్లెట్ రైల్ ప్రాజెక్టు గురించి ఆయనకు వివరించారు.
దీనికి సంబంధించిన వివరాలను షిగేరు ఇషిబా తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. కొన్ని ఫొటోలను దీనికి జత చేశారు. మోదీతో కలిసి సెండాయ్కి వెళ్తున్నాను. నిన్నటి నుంచి ఆయనతో పాటు కారులో ప్రయాణిస్తున్నాను. ఇప్పుడు కొత్త అల్ఫా- ఎక్స్ బుల్లెట్ రైలు అని పేర్కొన్నారు.
仙台に到着いたしました。石破首相とともに新幹線でこの地を訪れました。@shigeruishiba pic.twitter.com/fJ4yr5gtKh
— Narendra Modi (@narendramodi) August 30, 2025
సెండాయ్ చేరుకున్న తర్వాత మోదీ.. జపాన్ రైల్వేస్లో శిక్షణ పొందుతున్న భారతీయ లోకో పైలట్లను కలిశారు. వారితో కొద్దిసేపు మాట్లాడారు. శిక్షణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ లోకో పైలెట్లను అహ్మదాబాద్- ముంబై మధ్య నడిపించదలిచిన బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ లో అపాయింట్ చేయనుంది కేంద్రం.
అంతకుముందు రోజు- టోక్యోలో 16 జపాన్ ప్రిఫెక్చర్ల గవర్నర్లతో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. భారత్-జపాన్ మైత్రీ బంధం గురించి మాట్లాడారు. ఈ రెండు దేశాల మధ్య కొనసాగుతోన్న వ్యూహాత్మక, గ్లోబల్ పార్ట్ నర్ షిప్ అంశాన్ని ప్రస్తావించారు. భారత ప్రయోజనాల కోసం ప్రిఫెక్చర్ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications