India-Maldives: మాల్దీవుల్ని ఆదుకునేది మేమే-అధ్యక్షుడికి గుర్తుచేసిన ప్రధాని మోడీ..!
ఒకప్పటి సన్నిహిత మిత్రదేశాలైన భారత్-మాల్దీవుల మధ్య గతేడాది చోటు చేసుకున్న ఓ పరిణామం గ్యాప్ తెచ్చింది. అయితే చైనాకు అనుకూలుడుగా పేరున్న అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జుపై ఈ ప్రభావం పడింది. దీన్నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న మొయిజ్జు ఇవాళ న్యూఢిల్లీకి వచ్చి భారత ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య అన్ని అంశాలపై వీరిద్దరూ చర్చించుకున్నారు. అనంతరం మాల్దీవుల విషయంలో భారత్ వైఖరిని ప్రధాని మోడీ మరోసారి స్పష్టం చేశారు.
ఇవాళ ఢిల్లీలోని హైదరాబాద్ భవన్ లో మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజుతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య తాజా పరిస్ధితులపై చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని మాల్దీవుల అధ్యక్షుడికి మోడీ గుర్తుచేసారు. మాల్దీవులకు భారత్ సన్నిహిత మిత్ర దేశమని, భారత్ యొక్క "పొరుగే ముందు "( neighbourhood first) సిద్ధాంతాన్ని కూడా గుర్తుచేసారు. గతంలో కోవిడ్ వ్యాక్సిన్లతో పాటు మాల్దీవుల్లో ఇన్ ఫ్రా ప్రాజెక్టుకు భారత్ అందించిన సాయాన్ని కూడా గుర్తుచేస్తూ.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇరుదేశాల ఆర్ధిక వ్యవస్థల స్దిరత్వానికి హిందూ మహాసముద్రంలో భద్రత చాలా కీలకమని ఇరుదేశాల అధినేతలు అభిప్రాయపడ్డారు. గతేడాది ప్రధాని మోడీ లక్షద్వీప్ టూర్ పై మాల్దీవుల మంత్రుల విమర్శల తర్వాత ఇరుదేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఇరుదేశాలూ దౌత్యవేత్తల్ని సైతం బహిష్కరించుకున్నాయి. అనంతరం తిరిగి ఇరుదేశాల సంబంధాలను గాడిన పెట్టేలా ఇవాళ్టి సమావేశం జరిగింది. దీంతో మోడీ సైతం గతాన్ని ఎక్కడా గుర్తుచేయలేదు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications