ఉత్తరాఖండ్ లో ప్రధాని మోడీ-కేదార్ నాథ్ లో పూజలు-శంకరాచార్య సమాధి సందర్శన
ప్రధాని మోడీ ఇవాళ ఉత్తరాఖండ్ లో పర్యటిస్తున్నారు. ఉత్తరాఖండ్ పర్యటనలో భాగంగా కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోడీ.. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోడీ రాక సందర్భంగా కేదార్ నాథ్ ఆలయంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసి ఆయనకు ఘనస్వాగతం పలికారు.
Uttarakhand | PM Narendra Modi arrives in Kedarnath, offers prayers at Kedarnath temple pic.twitter.com/vIjOy77xFI
— ANI (@ANI) October 21, 2022
అనంతరం ప్రధాని మోడీ కేదార్ నాథ్ లోని ఆదిగురువు శంకరాచార్య సమాధిని సందర్శించారు. ఇక్కడ శంకరాచార్యుడి భారీ ప్రతిమ ఉంది. దాని ముందు నిలబడి ప్రధాని ప్రార్ధన చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో కేదార్ నాథ్ లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ.. శంకరాచార్య సమాధి వద్ద కూడా ప్రత్యేక దుస్తుల్లోనే కనిపించారు. మోడీ తన టూర్ లో కేవలం ఒక్కరే ఆలయాలను సందర్శిస్తున్నారు.
BREAKING :
— Jan Ki Baat (@jankibaat1) October 21, 2022
Prime Minister Narendra Modi visits the Adi Guru Shankaracharya Samadhi Sthal in Kedarnath.
Picture Courtesy - ANI #Kedarnath #NarendraModi pic.twitter.com/OrRBoO8vLZ
అనంతరం ప్రధాని మోడీ కేదార్ నాథ్ లో చేపడుతున్న పలు అభివృద్ది పథకాల పురోగతిని అధికారులతో కలిసి సమీక్షించారు. స్వయంగా వాహనం నడుపుతూ మందాకిని అష్ఠపత్, సరస్వతీ అష్ఠపథ్ పనుల్ని పరిశీలించారు. అధికారులు అక్కడ పనులు జరుగుతున్న తీరును ప్రధానికి వివరించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రధాని మోడీ ఈ సందర్భంగా ఆదేశాలు ఇచ్చారు.
Uttarakhand | Prime Minister Narendra Modi reviews the progress of development works along Mandakini Asthapath and Saraswati Asthapath in Kedarnath during his visit pic.twitter.com/1jHP1eLAN4
— ANI (@ANI) October 21, 2022