జయలలిత ఇంట్లో భోజనం చేసిన నరేంద్ర మోడీ
చెన్నయ్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జే. జయలలిత శుక్రవారం మద్యాహ్నం కలిసి బోజనం చేశారు. ఇదే సందర్బంలో పలు విషయాలపై ఇద్దరు సుదీర్ఘంగా చర్చించడంతో తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి.

శుక్రవారం నరేంద్ర మోదీ చెన్నయ్ వెళ్లారు. జయలలిత ఆహ్వానాన్ని మన్నించిన ప్రధాని నరేంద్ర మోదీ పోస్ గార్డెన్ లోని ఆమె నివాసం చేరుకున్నారు. ఈ సందర్బంలో మోదీ, అమ్మ అక్కడే బోజనం చేశారు. తరువాత జయలలిత ఒక మొమోరాండాన్ని ప్రధాని మోదీకి అందించారు.
కర్ణాటక, కేరళ రాష్ట్రాలలోని జల వివాదాన్ని జయలలిత ప్రస్తావించారని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అదే సందర్బంలో మోదీ పార్లమెంట్ అమోదం కోసం వేచి ఉన్న భూ సేకరణ బిల్లుకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మద్దతు కోరినట్లు సమాచారం.

సుమారు 50 నిమిషాల పాటు ప్రధాని మోదీ, జయలలిత పలు విషయాలపై చర్చించారు. ప్రధాన మంత్రి అయిన తరువాత నరేంద్ర మోదీ మొదటి సారి తమిళనాడు వెళ్లారు. అదే సమయంలో దక్షిణ భారతదేశంలో ఒక బలమైన నాయకురాలితో ఆయన భేటి కావడంతో రాజకీయంగా చర్చకు దారి తీసింది.
-
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్












Click it and Unblock the Notifications