జయలలిత ఇంట్లో భోజనం చేసిన నరేంద్ర మోడీ
చెన్నయ్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జే. జయలలిత శుక్రవారం మద్యాహ్నం కలిసి బోజనం చేశారు. ఇదే సందర్బంలో పలు విషయాలపై ఇద్దరు సుదీర్ఘంగా చర్చించడంతో తమిళనాడు రాజకీయాలు వేడెక్కాయి.
శుక్రవారం నరేంద్ర మోదీ చెన్నయ్ వెళ్లారు. జయలలిత ఆహ్వానాన్ని మన్నించిన ప్రధాని నరేంద్ర మోదీ పోస్ గార్డెన్ లోని ఆమె నివాసం చేరుకున్నారు. ఈ సందర్బంలో మోదీ, అమ్మ అక్కడే బోజనం చేశారు. తరువాత జయలలిత ఒక మొమోరాండాన్ని ప్రధాని మోదీకి అందించారు.
కర్ణాటక, కేరళ రాష్ట్రాలలోని జల వివాదాన్ని జయలలిత ప్రస్తావించారని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. అదే సందర్బంలో మోదీ పార్లమెంట్ అమోదం కోసం వేచి ఉన్న భూ సేకరణ బిల్లుకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మద్దతు కోరినట్లు సమాచారం.
సుమారు 50 నిమిషాల పాటు ప్రధాని మోదీ, జయలలిత పలు విషయాలపై చర్చించారు. ప్రధాన మంత్రి అయిన తరువాత నరేంద్ర మోదీ మొదటి సారి తమిళనాడు వెళ్లారు. అదే సమయంలో దక్షిణ భారతదేశంలో ఒక బలమైన నాయకురాలితో ఆయన భేటి కావడంతో రాజకీయంగా చర్చకు దారి తీసింది.