వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం, నమాజ్ పిలుపు వినగానే, అందరికీ ఆశ్చర్యం !

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: గుజరాత్‌ శాసన సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బిజీగా ఉన్నారు. గుజరాత్ లోని నవ్‌రాసిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా నరేంద్ర మోడీ అనూహ్యంగా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. శాసన సభ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తుండగానే నమాజ్‌ శబ్దం వినిపించింది.

ఆ సందర్బంలో ప్రధాని నరేంద్ర మోడీ నమాజ్ పూర్తి అయ్యే వరకు తన ఎన్నికల ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేశారు. అంతే కాకుండా ప్రసంగం చేస్తున్న చోట ప్రధాని నరేంద్ర మోడీ మౌనంగా నిలుచుకున్నారు.

PM Narendra Modi pauses speech hearingNamaz

ముస్లింలకు ఎంతో పవిత్రమైన ప్రార్థన పట్ల ప్రధాని నరేంద్ర మోడీ గౌరవం చూపుతూ ఎన్నికల ప్రచార ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేసి అక్కడున్న ప్రజలను ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అన్ని మతాల వారిని గౌరివిస్తారని చెప్పాడానికి ఇది ఒక్క ఉదాహరణ అంటూ బీజేపీ నాయకులు అంటున్నారు.

ముస్లీంలకు ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేకం కాదని, నమాజ్ అంటే ఆయనకు చాల గౌరవం ఉందని బీజేపీ నాయకులు మరో సారి గుర్తు చేశారు. 2016లో ప్రధాని హోదాలో గుజరాత్ పర్యటన సందర్బంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సమయంలో నమాజ్ శబ్దం వినపడగానే ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని నిమిషాలు తన ప్రసంగం మధ్యలోనే నిలిపి వేశారు.

English summary
PM Narendra Modi was speaking in full flow when he stopped as the muezzin made the call for prayer from Masjid. This is our parampara.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X