ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం, నమాజ్ పిలుపు వినగానే, అందరికీ ఆశ్చర్యం !
అహ్మదాబాద్: గుజరాత్ శాసన సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బిజీగా ఉన్నారు. గుజరాత్ లోని నవ్రాసిలో ఎన్నికల ప్రచారం సందర్భంగా నరేంద్ర మోడీ అనూహ్యంగా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. శాసన సభ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తుండగానే నమాజ్ శబ్దం వినిపించింది.
ఆ సందర్బంలో ప్రధాని నరేంద్ర మోడీ నమాజ్ పూర్తి అయ్యే వరకు తన ఎన్నికల ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేశారు. అంతే కాకుండా ప్రసంగం చేస్తున్న చోట ప్రధాని నరేంద్ర మోడీ మౌనంగా నిలుచుకున్నారు.

ముస్లింలకు ఎంతో పవిత్రమైన ప్రార్థన పట్ల ప్రధాని నరేంద్ర మోడీ గౌరవం చూపుతూ ఎన్నికల ప్రచార ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేసి అక్కడున్న ప్రజలను ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ అన్ని మతాల వారిని గౌరివిస్తారని చెప్పాడానికి ఇది ఒక్క ఉదాహరణ అంటూ బీజేపీ నాయకులు అంటున్నారు.
ముస్లీంలకు ప్రధాని నరేంద్ర మోడీ వ్యతిరేకం కాదని, నమాజ్ అంటే ఆయనకు చాల గౌరవం ఉందని బీజేపీ నాయకులు మరో సారి గుర్తు చేశారు. 2016లో ప్రధాని హోదాలో గుజరాత్ పర్యటన సందర్బంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సమయంలో నమాజ్ శబ్దం వినపడగానే ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని నిమిషాలు తన ప్రసంగం మధ్యలోనే నిలిపి వేశారు.
-
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
చిన్నారి చీతాల గర్జన.. జ్వాలా ప్రసవంతో ఏడు దశాబ్దాల తర్వాత హఫ్ సెంచరీ -
చైనా, పాకిస్థాన్ కు ఊహించని గుడ్ న్యూస్ చెప్పిన భారత్.. -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications