26/11న దాడులు: భారత ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరన్నమోడీ (ఫోటోలు)
న్యూఢిల్లీ: పరస్పర సహకారంతో కలిసి నడిస్తే... సుసంపన్న దేశాలుగా సార్క్ దేశాలు అభివృద్ధి సాధించగలవని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 18వ సార్క్ సదస్సు నేపాల్లోని ఖాట్మండ్లో బుధవారం ప్రారంభమైంది. ఈ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోడీ మాట్లాడుతూ సార్క్ దేశాల మధ్య సహకారం పెరిగితే మరో వైపు చూడాల్సిన అవసరం ఉండదన్నారు. భారత్ గురించి ఎలాంటి కలలు కంటున్నామో.. సార్క్ కూడా అలాగే ఉండాలన్నది మా ఆకాంక్ష అని అన్నారు. సమష్టిగా ముందుకెళితే ఏ ఒక్క అవసరానికీ ఇతర దేశాల వైపు చూసే అవసరమే రాదని ఆయన పేర్కొన్నారు.
సార్క్ దేశాల్లో అపార అవకాశాలున్నాయని, వాటన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలంటే, పరస్పర సహకారం తప్పదన్నారు. సురక్షితమైన, బలమైన దక్షిణాసియాను భారత్ కోరుకుంటుందని తెలిపారు. సార్క్ దేశాల చిన్నారులకు టీబీ, హెచ్ఐవీ వ్యాక్సిన్లు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. సార్క్ దేశాల నుంచి రోగులకు తక్షణమే వైద్య వీసాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. సార్క్లోని ప్రతి దేశం సగౌరవంగా ప్రపంచం ముందు తలెత్తుకుని నిలవాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు.
సార్క్ దేశాల సహాకారంతో ఉపగ్రహాన్ని ప్రయోగించామని ఆయన పేర్కొన్నారు. దక్షిణాసియాలో శాంతికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముంబైపై 26/11న దాడి ఘటనకు ఈరోజుతో ఆరు సంవత్సరాలు పూర్తైనట్లు సదస్సులో వెల్లడించారు. ముంబైపై ఆనాడు జరిగిన దాడులను భారత ప్రజలు ఎన్నటికీ మర్చిపోలేరని అన్నారు. ఆ గాయం అంత సులువుగా మానిపోయేది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదంపై సార్క్ సమిష్టిగా పోరాడాలని పిలుపునిచ్చారు. మంచి పొరుగు దేశం ఉండాలని ఏ దేశమైనా ఆశిస్తుందని సార్క్ సదస్సులో పాకిస్తాన్పై ప్రధాని మోడీ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.

రోడ్డు మార్గంలో వద్దామంటే మా అధికారులు భయపడ్డారు: ప్రధాని మోడీ
18వ సార్క్ సదస్సు నేపాల్లోని ఖాట్మండ్లో బుధవారం ప్రారంభమైంది. ఈ సదస్సులో పాల్గొన్న ప్రధాని మోడీ మాట్లాడుతూ సార్క్ దేశాల మధ్య సహకారం పెరిగితే మరో వైపు చూడాల్సిన అవసరం ఉండదన్నారు. భారత్ గురించి ఎలాంటి కలలు కంటున్నామో.. సార్క్ కూడా అలాగే ఉండాలన్నది మా ఆకాంక్ష అని అన్నారు.

రోడ్డు మార్గంలో వద్దామంటే మా అధికారులు భయపడ్డారు: ప్రధాని మోడీ
సమష్టిగా ముందుకెళితే ఏ ఒక్క అవసరానికీ ఇతర దేశాల వైపు చూసే అవసరమే రాదని ఆయన పేర్కొన్నారు. సార్క్ దేశాల్లో అపార అవకాశాలున్నాయని, వాటన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలంటే, పరస్పర సహకారం తప్పదన్నారు.

రోడ్డు మార్గంలో వద్దామంటే మా అధికారులు భయపడ్డారు: ప్రధాని మోడీ
సురక్షితమైన, బలమైన దక్షిణాసియాను భారత్ కోరుకుంటుందని తెలిపారు. సార్క్ దేశాల చిన్నారులకు టీబీ, హెచ్ఐవీ వ్యాక్సిన్లు అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందన్నారు. సార్క్ దేశాల నుంచి రోగులకు తక్షణమే వైద్య వీసాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.

రోడ్డు మార్గంలో వద్దామంటే మా అధికారులు భయపడ్డారు: ప్రధాని మోడీ
సార్క్లోని ప్రతి దేశం సగౌరవంగా ప్రపంచం ముందు తలెత్తుకుని నిలవాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు. సార్క్ దేశాల సహాకారంతో ఉపగ్రహాన్ని ప్రయోగించామని ఆయన పేర్కొన్నారు.

రోడ్డు మార్గంలో వద్దామంటే మా అధికారులు భయపడ్డారు: ప్రధాని మోడీ
సార్క్లోని ప్రతి దేశం సగౌరవంగా ప్రపంచం ముందు తలెత్తుకుని నిలవాలన్నదే తమ లక్ష్యమని వెల్లడించారు. సార్క్ దేశాల సహాకారంతో ఉపగ్రహాన్ని ప్రయోగించామని ఆయన పేర్కొన్నారు.

రోడ్డు మార్గంలో వద్దామంటే మా అధికారులు భయపడ్డారు: ప్రధాని మోడీ
మంచి పొరుగు దేశం ఉండాలని ఏ దేశమైనా ఆశిస్తుందని సార్క్ సదస్సులో పాకిస్తాన్పై ప్రధాని మోడీ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.

రోడ్డు మార్గంలో వద్దామంటే మా అధికారులు భయపడ్డారు: ప్రధాని మోడీ
ఖాట్మండ్కు రోడ్డు మార్గం ద్వారా వద్దామనుకుంటే, మా అధికారులు భయపడ్డారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నందునే అధికారులు భయపడాల్సి వచ్చిందన్నారు. సార్క్ సదస్సు సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

రోడ్డు మార్గంలో వద్దామంటే మా అధికారులు భయపడ్డారు: ప్రధాని మోడీ
సార్క్ దేశాల మధ్య రోడ్డు, రైలు మార్గాలు అభివృద్ధి చెందాల్సి ఉందని చెప్పిన ఆయన ఆ సందర్భంగా నేపాల్, భారత్ల మధ్య ఉన్న రోడ్డు మార్గం దుస్థితిని చెప్పేందుకు ఈ అంశాన్ని ప్రస్తావించారు. సార్క్ దేశాల మధ్య మరింత సహకారం నెలకొంనేందుకు తప్పనిసరిగా రోడ్డు, రైలు మార్గాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుకావాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఖాట్మండ్కు రోడ్డు మార్గం ద్వారా వద్దామనుకుంటే, మా అధికారులు భయపడ్డారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నందునే అధికారులు భయపడాల్సి వచ్చిందన్నారు. సార్క్ సదస్సు సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
సార్క్ దేశాల మధ్య రోడ్డు, రైలు మార్గాలు అభివృద్ధి చెందాల్సి ఉందని చెప్పిన ఆయన ఆ సందర్భంగా నేపాల్, భారత్ల మధ్య ఉన్న రోడ్డు మార్గం దుస్థితిని చెప్పేందుకు ఈ అంశాన్ని ప్రస్తావించారు. సార్క్ దేశాల మధ్య మరింత సహకారం నెలకొంనేందుకు తప్పనిసరిగా రోడ్డు, రైలు మార్గాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుకావాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల ఆశయాల మేరకు పనిచేయలేకపోతున్న సార్క్ దేశాలు, పరస్పర సహకారంతో గణనీయ వృద్ధిని నమోదు చేయనున్నాయని ఆయన అభిప్రాయపడ్దారు. దక్షిణాసియాలో శాంతికి ఆప్ఘనిస్ధాన్ కట్టుబడి ఉందని ఆ దేశ అధ్యక్షుడు అశ్రఫ్ ఘనీ స్పష్టం చేశారు.
సమస్యల పరిష్కారానికి నమ్మకం కావాలి: పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్
ఎలాంటి వివాదాలు లేని, సామరస్యపూర్వక దక్షిణాసియాను తాము కోరుకుంటున్నామని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ అన్నారు. దేశాల మధ్య వివాదాలు పరిష్కారం కావాలంటే... నమ్మకం అనే బంధం కావాలని చెప్పారు.
ఖాట్మండ్లో జరుగుతున్న 18వ సార్క్ సదస్సులో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సార్క్ దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. సదస్సులో ఉమ్మడి అంశాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
ఉగ్రవాదం సవాలుగా మారింది: రాజపక్సే
18వ సార్క్ సదస్సులో శ్రీలంక అధ్యక్షుడు మాట్లాడుతూ ఉగ్రవాదం ప్రాంతీయంగా, అంర్జాతీయంగా సవాలుగా మారిందన్నారు.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications