ప్రత్యర్థులు కారు, పోటీదారులే : వారణాసి పోరుపై మోదీ
వారణాసి : వారణాసి పోరులో తనకెవరు ప్రత్యర్థులు కారని .. అందరూ పోటీదారులేనన్నారు ప్రధాని మోదీ. తనతో పోటీపడుతున్న వారిని ప్రత్యర్థులుగా చూడటం లేదని స్పష్టంచేశారు. ఇవాళ వారణాసి నుంచి నామినేషన్ వేసిన సందర్భంగా ఓ వార్తాసంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు మోదీ.
ఒక్క అభ్యర్థే కదా ?
వారణాసి బరిలో బలమైన ప్రత్యర్థులు లేరని మీడియా ప్రతినిధి ప్రశ్నిస్తే .. ఒక పార్టీ ఒక అభ్యర్థిని బరిలోకి దింపుతోందని చెప్పారు. ఇద్దరు, ముగ్గురిని పోటీలో నిలుపదు కదా అని తనదైనశైలిలో సమాధానం ఇచ్చారు. 2014లో ఆప్ అధినేత అరవింత్ కేజ్రీవాల్ వారణాసి నుంచి మోదీపై పోటీచేసి భారీ మెజార్టీతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ సారి కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీని బరిలోకి దింపుతారనే ప్రచారం జరిగినా .. చివరికి అజిత్ రాయ్ ను బరిలోకి దింపారు. గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ నుంచి రాయ్ పోటీచేసి ... మూడోస్థానంలో నిలిచారు.

నీరుగారిన ఉత్సాహం ?
ఈ సారి కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంకను బరిలోకి దింపుతారనే ఊహాగానాలపై మీ స్పందన ఏంటనే ప్రశ్నించగా .. ప్రియాంకను పోటీలో దింపుతారని వారణాసి ప్రజలు కూడా ఉత్సాహంగా ఎదురుచూశారు కానీ వారి సంతోషాన్ని కాంగ్రెస్ పార్టీ నీరుగార్చిందని ... ఓడిపోతుందనే భయంతో బరిలోకి దింపలేదనే సమాధానం ఇచ్చారు మోదీ.












Click it and Unblock the Notifications