Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అద్భుతమైన అనుభవం: లక్షద్వీప్ సముద్రంలో మోడీ స్నోర్కెలింగ్

ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) బుధవారం లక్షద్వీప్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రకృతి అందాలను అస్వాదించడంతోపాటు కాసేపు సముద్ర ఒడ్డున సేద తీరారు. అంతేగాక, సముద్రంలో సాహసోపేతమైన స్నార్కెలింగ్ కూడా చేశారు. సముద్ర గర్భంలోకి వెళ్లి అక్కడి పగడపు దిబ్బలు, జీవరాశులను ప్రత్యక్షంగా వీక్షించారు ప్రధాని మోడీ. ఇందుకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోడీ తన ట్విట్టర్(ఎక్స్) ఖాతాలో పంచుకున్నారు.

.

'లక్షదీవుల సౌందర్యం, అక్కడి ప్రజల మమకారం చూసి నేనింకా సంభ్రమాశ్చర్యంలోనే ఉన్నా. ప్రకృతి అందాలు, ప్రశాంతమైన వాతావరణంలో ఈ దీవులు మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం నేను మరింత కష్టపడి ఎలా పనిచేయాలో ఈ వాతావరణం నాకు నేర్పింది. సాహసాలు చేయాలనుకునేవారు మీ జాబితాలో లక్షద్వీప్ ను కూడా చేర్చుకోండి' అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

 PM Narendra Modi shared lakshadweep tour pictures and experience snorkelling

లక్షద్వీప్‌(Lakshadweep)లో తాను స్నార్నెలింగ్ కూడా ప్రయత్నించినట్లు మోడీ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. పగడవపు దీవులు, చేపల ఫొటోలను షేర్ చేశారు. ఇది ఎంతో అద్భుతమైన అనుభవం అని పేర్కొన్నారు ప్రధాని మోడీ.

 PM Narendra Modi shared lakshadweep tour pictures and experience snorkelling

కాగా, స్నార్నెలింగ్ అనేది సముద్రంలో చేసే ఓ తరహా డైవింగ్ లాంటిది. స్నార్నెల్ అనే ట్యూబ్, డైవింగ్ మాస్క్‌ను ముఖానికి ధరించి సముద్రం లోపల ఈత కొడతారు. ఈ స్నార్కెలింగ్‌తో సముద్ర గర్భంలో పర్యావరణాన్ని జీవరాశులను దగ్గర్నుంచి వీక్షించవచ్చు. ప్రధాని మోడీకి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+