కూల్చిన చోటే విద్యాసాగర్ విగ్రహం ప్రతిష్టిస్తాం : బెంగాల్ మరో ముంబై అవుతుందన్న మోడీ
మావు : అమిత్ షా ర్యాలీతో చెలరేగిన మాటల యుద్ధం బీజేపీ, టీఎంసీ మధ్య ఇంకా కొనసాగుతుంది. రాష్ట్రంలో పరిస్థితుల దృష్ట్యా ఎన్నికల ప్రచారాన్ని ఒకరోజు మందుగానే ఎన్నికల సంఘం నిలిపివేసింది. ఈ క్రమంలో యూపీలోని మావులో జరిగిన ప్రధాని మోడీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దీదీ, టీఎంసీ వైఖరిపై నిప్పులు చెరిగారు.

టీఎంసీ దౌర్జన్యం
కోల్ కతాలో అమిత్ షా ర్యాలీలో టీఎంసీ దౌర్జన్యం కళ్లారా చూశామన్నారు ప్రధాని మోడీ. వారే ఆందోళన చేపట్టి .. ఈశ్వర చంద్ర విద్యాసాగర్ విగ్రహాన్ని కూల్చివేశారని ఆరోపించారు. తప్పు చేసి నెపం తమపై నెట్టేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. టీఎంసీ కూల్చిన విద్యాసాగర్ విగ్రహాన్ని అదే చోట తిరగి ప్రతిష్టిస్తామి మోడీ హామీనిచ్చారు.

దీదీ వర్సెస్ మోడీ
19వ దశాబ్దానికి చెందిన విద్యావేత్త, సామాజికవేత్త విద్యాసాగర్ విగ్రహాం ధ్వంసమవడంపై రాజకీయ దుమారం చెలరేగింది. ఇది బెంగాల్ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్ సంస్కృతి, సంప్రదాయాలపై చేసిన దాడిగా అభివర్ణించారు. విద్యాసాగర్ అంటే తమకు ఎంతో గౌరవమని .. టీఎంసీ గుండాలే కూల్చివేశారని మోడీ, అమిత్ షా మండిపడ్డారు. బెంగాల్లో మమతా బెనర్జీ .. యూపీ, బీహర్, పూర్వంచల్ ప్రజలను లక్ష్యంగా చేసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు మోడీ. వారిని ఇతర ప్రాంతాల వారని చెప్పి అవమానిస్తున్నారని విమర్శించారు. వాస్తవానికి బెహన్ జీ మాయావతి మమతాపై దాడి చేయాల్సింది .. కానీ అలా జరగడం లేదు, కారణమెంటో అందరికీ తెలుసు అని మోదీ అన్నారు.

ప్రచారం నిలిపివేత
బెంగాల్తో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఈసీ 36 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేసింది. దీనిపై మమత తీవ్రంగా స్పందించారు. మోదీ, అమిత్ షా చెప్పినట్టు ఎన్నికల సంఘం నడుచుకుంటుందని విమర్శించారు. బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం చెలరేగిన అల్లర్ల తర్వాత కంటే బెంగాల్ లో ఘోరమైన పరిస్థితి ఉందా అని మండిపడ్డారు.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications