సీఎంలతో మోడీ సమావేశం: కరోనా ఉధృతి, నివారణ చర్యలపై డిస్కషన్..
కరోనా వైరస్ కేసులు తగ్గడం లేదు. సెకండ్ వేవ్ స్టార్ట్ అయినట్టే అనిపిస్తోంది. అసలే శీతాకాలం కావడంతో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కరోనా వైరస్ ఎక్కువ ప్రభావం గల 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. వైరస్ కేసులు పెరగడానికి కారణం.. నివారణకు గల ప్రణాళికలపై సీఎంలతో ప్రధాని మోడీ డిస్కష్ చేస్తారు.

ఉదయం 10.30 గంటలకు కరోనా వైరస్ తీవ్రత ఎక్కువ గల రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతం సీఎం/ లెప్టినెంట్ గవర్నర్లతో ఇంటరాక్ట్ అవుతారు. రెండో విడత అన్నీ రాష్ట్రాలు సీఎంలతో సమావేశమై.. వ్యాక్సిన్ సరఫరా గురించి చర్చిస్తారని తెలిసింది.
Recommended Video
దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. 44 వేల 59 కేసులతో మొత్తం కేసుల సంఖ్య 91 లక్షలకు చేరింది. ఢిల్లీ, కేరళ, మహారాష్ట్రలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఢిల్లీలో 6746 కేసులు రాగా.. మహారాష్ట్రలో 5200, కేరళలో 5700 కేసులు వచ్చాయి. పశ్చిమ బెంగాల్ 3600, రాజస్తాన్లో 3260 కేసుల చొప్పున వచ్చాయి. అయితే హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, గుజరాత్, మణిపూర్లో కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications