సీఎంలతో ప్రధాని మోడీ మీట్.. ఇప్పుడు ఎందుకంటే..
కరోనా వైరస్ తిరిగి విజృంభిస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బుధవారం వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. కరోనా వైరస్ కోసం ఇప్పటికే పలు రాష్ట్రాలు తగిన చర్యలను తీసుకుంటున్నాయి. మహారాష్ట్రతోపాటు మరికొన్ని రాష్ట్రాలు లాక్డౌన్, రాత్రి సమయంలో కర్ఫ్యూను విధిస్తూ కరోనా వైరస్ను కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు.
రూ.1300 కోట్లు మీవే కావొచ్చు: ఈ బుధవారమే పవర్బాల్ లాటరీ..ఎలా ఆడాలంటే..?
ఏం చర్యలు తీసుకుంటే కరోనా వైరస్ కట్టడి చేయవచ్చనే సమాలోచన చేస్తున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు తీసుకున్న చర్యలను కూడా ప్రధానికి వివరించనున్నట్లు తెలుస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏం చేద్దాం అనే విషయంపై ప్రధానంగా చర్చించనున్నారు. పది వేల కరోనా కేసుల నుంచి ప్రస్తుతం రోజుకు 26 వేలకు పెరిగాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. నివారణ చర్యలు తీసుకుంటోంది.
కరోనా స్ట్రెయిన్ టెన్షన్ ఒకవైపు ఉంది. ఈ క్రమంలో కేసులు కూడా ఎక్కువగా వస్తున్నాయి. దీంతో నివారణ చర్యలపై కేంద్రం ఫోకస్ చేసింది. మరోవైపు టీకాలు ఇస్తూనే జాగ్రత్తలపై నిమగ్నమయ్యింది.