నన్ను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు, అయినా భయపడను: దీప
తనను హత్య చేస్తామంటూ కొన్ని రాజకీయ పార్టీల అనుచరులు బెదిరిస్తున్నారంటూ ఎంజీఆర్ అమ్మ దీప పేరవై అధ్యక్షురాలు దీప ఆరోపించారు.
చెన్నై: తనను హత్య చేస్తామంటూ కొన్ని రాజకీయ పార్టీల అనుచరులు బెదిరిస్తున్నారంటూ ఎంజీఆర్ అమ్మ దీప పేరవై అధ్యక్షురాలు దీప ఆరోపించారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
తన మేనత్త, దివంగత సీఎం జయలలిత ఆశయాలను కొనసాగించేందుకు తాను రాజకీయ ప్రవేశం చేశానని, తనను రాజకీయాల్లో రాకుండా అడ్డుకొనేందుకు పలువురు చేసిన యత్నాలు ఫలించలేదని దీప పేర్కొన్నారు.

దీంతో ఇప్పుడు ఏకంగా తనను హత్య చేస్తామంటూ కొందరు బెదిరిస్తున్నారని, వారిలో పీఎంకే వ్యవస్థాపకులు రాందాస్ అనుచరులు ఉన్నారని, వారు తనకు ఫోన్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారని దీప ఆరోపించారు.
అవినీతి నిర్మూలనే తమ ధ్యేయమని రాందాస్ చేస్తున్న ప్రకటనల్లో వాస్తవం లేదని, పీఎంకే నేతలు మతాల పేరుతో రాజకీయం చేస్తున్నారని ఆమె విమర్శించారు. తన మేనత్తను ఆదర్శంగా తీసుకొని తాను రాజకీయంగా ఎదురవుతున్న ఒత్తిళ్లను అధిగమిస్తానని దీప ఆ ప్రకటనలో ధీమా వ్యక్తం చేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications