మోదీ నయా రికార్డు.. ట్రంప్ ను దాటి.. ప్రపంచంలో తొలి నేతగా..
భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ పేరు మీద అనేక రికార్డులు ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా డిజిటల్ గానూ ఆయన కొత్త మైలురాయిని అధిగమించారు. ఇన్ స్టా గ్రామ్ లో మోదీ ఫాలోవర్స్ 100 మిలియన్ లు దాటారు. దాంతో ఇన్ స్టాలో 10 కోట్ల మంది ఫాలోవర్స్ ను సంపాదించిన తొలి ప్రపంచ నేతగా ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు నెలకొల్పారు. ఇక ప్రస్తుతం ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్ల సంఖ్య ప్రస్తుతం 100 మిలియన్లు దాటారు. అంటే 10 కోట్ల మంది ఫాలోవర్స్ ను సంపాదించారు. ప్రపంచంలో ఏ దేశ నాయకుడికీ లేని విధంగా మోదీ డిజిటల్ మీడియాలో ఫాలోవర్స్ ను పొందారు. దాంతో ప్రపంచంలోనే తొలి నేతగా మోదీ రికార్డు నెలకొల్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను సైతం వెనక్కు నెట్టి ఈ అరుదైన ఘనతను సాధించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని మోదీ నిలిచారు. అటు ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఇజ్రాయెల్ పార్లమెంటులో కీలక ప్రసంగం చేసి చరిత్ర సృష్టించారు.
ఇక సోషల్ మీడియాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు 4.32 కోట్ల ఫాలోవర్స్ ఉన్నారు. ఆ తర్వాత ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోకు 1.5 కోట్ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్నారు. ఇక నాలుగో స్థానంలో బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా ఉన్నారు. ఆయనకు సోషల్ మీడియాలో 1.44 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రధాని మోదీ ఇన్ స్టా గ్రామ్ లో చేరారు. ఎప్పటికప్పుడు తన అధికారిక కార్యక్రమాలు, పర్యటనలు, ప్రసంగాలు, పోస్టులు, వివిధ కార్యక్రమాల ద్వారా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ ఘనతను సాధించగలిగారు.

ఇక భారత్ లోనూ ప్రధాని నరేంద్ర మోదీ.. సోషల్ మీడియా ఫాలోవర్స్ లో అందరికంటే చాలా ముందున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రస్తుతం 1.61 కోట్ల ఫాలోవర్లతో రెండో స్థానంలో ఉండగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 1.26 కోట్ల ఫాలోవర్స్ తో మూడో స్థానంలో నిలిచారు. ఇక తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్ పార్లమెంట్ అత్యున్నత పురస్కారమైన "స్పీకర్ ఆఫ్ ది నెస్సెట్ మెడల్" లభించింది. భారత్- ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో, వ్యక్తిగత నాయకత్వం ద్వారా రక్షణ, భద్రత, సాంకేతికత, దౌత్య సహకారం వంటి రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించిన ఆయన కృషికి గుర్తింపుగా దీనిని జెరూసలెంలోని పార్లమెంటులో అందజేశారు. ఈ గౌరవం పొందిన తొలి భారత ప్రధాని మోదీనే కావడం విశేషం.
-
బాలయ్య - గోపీచంద్ మలినేని మూవీలో విలన్గా మంచు హీరో..! -
విజయ్ రూ. 250 కోట్ల భరణం? -
ఆ హీరోయిన్ ను పెళ్లాడనున్న ఆనంద్ దేవరకొండ..? -
IND Vs ENG: ఫామ్ లో లేకున్నా ఇంగ్లండ్ ను భయపెడుతున్న ఒకే ఒక్కడు..! -
ధోనీ అన్నా.. ఐపీఎల్ టైమ్ లో నువ్వే ఇట్ల చేస్తే ఎట్లా -
ఇరాన్ వ్యూహం భారత్ కు నేర్పుతున్న పాఠం..! సాయిరెడ్డి షాకింగ్ ట్వీట్..! -
తెలంగాణ స్పెషల్ 'సల్లచారు'.. ఇలా చేస్తే వేసవిలో చలచల్లగా.. -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజీనామా? రేపే నామినేషన్..! -
లడ్డూ వ్యవహారంలో బిగ్ ట్విస్ట్, ఇక నెక్స్ట్..!! -
30ఏళ్ళ తర్వాత బుధుడి నక్షతంలోకి శనిదేవుడు.. వీరికి సంతోషాల బొనాంజా! -
కుప్పకూలిన రూపాయి: డాలర్ తో పోల్చుకుంటే..!! -
రేవంత్ రాజ్యసభ ఛాయిస్ 'ఆయనే', కొత్త పేరుతో ఖర్గే బ్రేక్ - రాహుల్ అనూహ్య నిర్ణయం..!!












Click it and Unblock the Notifications