ఎంత ధైర్యం: పన్నీర్ సెల్వంకు మన్నార్ గుడి మాఫియా వార్నింగ్ !
చెన్నై: పోయెస్ గార్డెన్ లో మన్నార్ గుడి గ్యాంగ్ అన్నీ తామై చూసుకోవడంతో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. అన్నాడీఎంకే పార్టీలో ఇప్పుడు మన్నార్ గుడి మాఫియా పెత్తనం ఎక్కువ అయ్యిందని మళ్లీ వెలుగు చూసింది.
మీకు ఎంత ధైర్యం ఉంటే ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ తో సమావేశం అవుతారు ? అంటూ సీఎం పన్నీర్ సెల్వంను మన్నార్ గుడి మాఫియా గ్యాంగ్ ప్రశ్నించిందని, ఆ విషయంలో ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆయన వర్గీయులు అంటున్నారు.
శశికళకు షాక్: సంక్రాంతి బరిలో జయ మేనకోడలు దీపా
తుఫానుల తీవ్రవతతో నష్టపోయి, మరో వైపు ఎగువ ప్రాంతాల నుంచి నీరు రాక రాష్ట్ర రైతాంగం అల్లాడిపోతోందని, అందు వలన రాష్ట్రాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ డిమాండ్ చేశారు.
ఈ విషయంపై బుధవారం సాయంత్రం స్టాలిన్, డీఎంకే పార్టీ సీనియర్ నేతలు దురైమురుగన్, పొన్ముడి, కేఎన్ నెహ్రూ తదితరులతో కలిసి సచివాలయానికి వెళ్లి సీఎం పన్నీర్ సెల్వంను కలిశారు. తమిళనాడులో రైతులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సీఎంకు చెప్పారు.
శశికళ VS స్టాలిన్: వార్ వన్ సైడ్, పాపం చిన్నమ్మ!
వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తమిళనాడును కరువు రాష్ట్రంగా ప్రకటించాలని ఒత్తిడి చెయ్యాలని, అందుకు ప్రతిపక్షం అయిన మేము (డీఎంకే) మీకు పూర్తి మద్దతు ఇస్తాయని సీఎం పన్నీర్ సెల్వంకు స్టాలిన్ చెప్పారు. ఇదే విషయంపై సీఎం, ప్రతిపక్ష నేత చర్చించారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతామని పన్నీర్ సెల్వం స్టాలిన్ కు హామీ ఇచ్చారు.
సచివాలాయానికి వెళ్లిన స్టాలిన్ ను సీఎం పన్నీర్ సెల్వం సాదరంగా ఆహ్వానించారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనందుకు స్టాలిన్ ను పన్నీర్ సెల్వం అభినందిచారు. స్టాలిన్ కూడా సీఎం పన్నీర్ సెల్వంకు కృతజ్ఞతలు చెప్పారు.
పన్నీర్ సెల్వం, స్టాలిన్ భేటి: ఆట మొదలైయ్యింది!
కరుణానిధి ఆరోగ్యం గురించి పన్నీర్ సెల్వం అడిగి తెలుసుకున్నారని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న మన్నార్ గుడి మాఫియా గ్యాంగ్ పన్నీర్ సెల్వం తీరుపై మండిపడ్డారని తెలిసింది. బద్దశత్రువు అయిన స్టాలిన్ తో భేటీ అయ్యిందికాక ఇప్పుడు ఆయను అభినందిస్తారా అంటూ ప్రశ్నించడంతో పన్నీర్ సెల్వం అసహనం వ్యక్తం చేశారని ఆయన వర్గీయులు అంటున్నారు.