విధ్యార్ధులతో అసహజ శృంగారం, మెబైల్ తో ఇలా...
విధ్యార్థులపై అత్యాచారం చేయడంతో పాటు ఆ దృశ్యాలను తన మొబైల్ ఫోన్లో రికార్డు చేశాడు ఓ ఉపాధ్యాయుడు. ఇద్దరు బాధితుల ఫిర్యాదు మేరకు రాజస్థాన్ పోలీసులు రమీజ్ అనే ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు.
జైపూర్: భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు విధ్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు.లైంగికంగా వేధింపులకు పాల్పడే సమయంలో తన మొబైల్ ఫోన్లలో ఆ దృశ్యాలను రికార్డుచేసేవాడు.అయితే ఇద్దరు బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకొంది.
రాజస్థాన్ లోని జైపూర్ సమీపంలోని పాఠశాలలో విధ్యార్థులకు పాఠాలు చెప్పకుండా వారిని లైంగిక అవసరాలకు ఉపయోగించుకొంటున్నాడు ఓ ప్రబుద్దుడు. అంతేకాదు విధ్యార్థులతో అసహజ శృంగారానికి పాల్పడుతూ వాటిని తన మొబైల్ ఫోన్లో రికార్డుచేసేవాడు.
27 ఏళ్ళ రమీజ్ అనే ఉపాధ్యాయుడు విధ్యార్థులపై అత్యాచారానికి పాల్పడేవాడు.ఈ రకంగా పలువురు విధ్యార్థులపై నిందితుడు అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. నిందితుడి నుండి 76 వీడియోలను స్వాధీనం చేసుకొన్నారు.
ఉపాధ్యాయుడి బాగోతం గురించి పోలీసులకు ఇద్దరు బాధితులుఫిర్యాదు చేశారు.నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.విధ్యార్థులపై అత్యాచారం చేయడంతో పాటు బాధితుల సహయంతోనే వీడియోలు రికార్డుచేసేవాడని పోలీసులు తెలిపారు.