పోలీస్ భవనంపై ఉగ్రదాడి: ఒకరు మృతి, ఆరుగురికి గాయాలు
జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి దాడులకు తెగబడ్డారు. పోలీస్ భవనంలోకి చొరబడి.. విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ పోలీసు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి దాడులకు తెగబడ్డారు. పోలీస్ భవనంలోకి చొరబడి.. విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ పోలీసు మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు.
పుల్వామాలోని జిల్లా పోలీసు భవనంపై శనివారం ఉదయం ఉగ్రవాదులు దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. ముగ్గురు ఉగ్రవాదులు భవనంలోకి చొరబడి కాల్పులు జరిపారు. పోలీసులపైకి గ్రనేడ్లు విసిరారు.

Recommended Video

కాల్పులతో బెదిరిస్తూ.. భవనం లోపలికి వెళ్లి ఉగ్రవాదులు దాక్కున్నట్లు సమాచారం.
ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ పోలీసు మృతిచెందగా.. మరో ఆరుగురు గాయపడ్డారు. వీరిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా ఉన్నారు.
అయితే ఉగ్రవాదులు పోలీసులను బంధీలుగా చేసుకోలేదని ఐజీ మునీర్ అహ్మద్ఖాన్ తెలిపారు. సీఆర్పీఎఫ్, పోలీసులు భవనాన్ని చుట్టుముట్టారు. సుమారు ఇద్దరు ఉగ్రవాదులు భవనంలో నక్కినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు.












Click it and Unblock the Notifications