మధ్యప్రదేశ్, మిజోరంలో ప్రారంభమైన పోలింగ్.. ఇక మిగిలింది తెలంగాణ, రాజస్థాన్
Recommended Video

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బుధవారం మధ్యప్రదేశ్, మిజోరంలలో పోలింగ్ ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ లోని 230 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 2,899 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పోలింగ్ కోసం 65 వేల బూత్ లు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మిజోరంలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించడానికి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. 40 స్థానాలకు గాను 209 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ కోసం 1,164 బూత్ లు ఏర్పాటు చేసింది ఎలక్షన్ కమిషన్. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

బీజేపీ, కాంగ్రెస్ తో పాటు ఆయా రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈనెల 12, 20 తేదీల్లో రెండు విడతలుగా ఛత్తీస్ గఢ్ లో ఎన్నికలు జరిగాయి. బుధవారం మధ్యప్రదేశ్, మిజోరంలలో పోలింగ్ పూర్తవుతుంది. ఇక తెలంగాణ, రాజస్థాన్ ఎన్నికలు డిసెంబర్ 7న జరగనున్నాయి. అయితే ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు డిసెంబర్ 11న వెలువడనున్నాయి.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications