మధ్యప్రదేశ్, మిజోరంలో ప్రారంభమైన పోలింగ్.. ఇక మిగిలింది తెలంగాణ, రాజస్థాన్
Recommended Video

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో బుధవారం మధ్యప్రదేశ్, మిజోరంలలో పోలింగ్ ప్రారంభమైంది. మధ్యప్రదేశ్ లోని 230 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను 2,899 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. పోలింగ్ కోసం 65 వేల బూత్ లు ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మిజోరంలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించడానికి ప్రజలు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. 40 స్థానాలకు గాను 209 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ కోసం 1,164 బూత్ లు ఏర్పాటు చేసింది ఎలక్షన్ కమిషన్. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

బీజేపీ, కాంగ్రెస్ తో పాటు ఆయా రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈనెల 12, 20 తేదీల్లో రెండు విడతలుగా ఛత్తీస్ గఢ్ లో ఎన్నికలు జరిగాయి. బుధవారం మధ్యప్రదేశ్, మిజోరంలలో పోలింగ్ పూర్తవుతుంది. ఇక తెలంగాణ, రాజస్థాన్ ఎన్నికలు డిసెంబర్ 7న జరగనున్నాయి. అయితే ఈ ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలు డిసెంబర్ 11న వెలువడనున్నాయి.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications