సజావుగా సాగుతున్న ఐదో విడత పోలింగ్
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో దశ పోలింగ్ సజావుగా సాగుతోంది. ఏడు రాష్ట్రాల్లో 51 నియోజకవర్గాల ఓటర్లు ఈ దఫా ఓటు వేయనున్నారు. మొత్తం 674మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేస్తున్నారు. నాలుగు దశ ఎన్నికలతో పోలిస్తే ఈ దశలో అత్యధిక సంఖ్యలో మహిళా అభ్యర్థులు బరిలో నిలిచారు. జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ లోక్సభ స్థానానికి ఇవాళ్టితో పోలింగ్ పూర్తికానుంది.
ఏదో దశలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పలువురు ప్రముఖులు పోలింగ్ స్టేషన్ల వద్ద క్యూ కట్టారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్, స్మతిఇరానీ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఈ దశలోనే పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ సందర్భంగా బెంగాల్లో ఎలాంటి ఘర్షణలు తలెత్తకుండా కేంద్ర బలగాలను మోహరించారు. 51 నియోజకవర్గాల్లో సాయంత్రం ఆరింటి వరకు పోలింగ్ జరగనుంది.
లోక్సభ ఎన్నికలు 2019: ఏడు రాష్ట్రాల్లో ప్రారంభమైన పోలింగ్