7 రోజులు సంతాప దినాలు - ప్రణబ్ మృతిపై కేంద్రం ప్రకటన - కార్యాలయాల్లో జెండా అవనతం
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతితో యావత్ దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. దేశం తన ముద్దుబిడ్డను కోల్పోయినవేళ ఏడు రోజుల పాటు సంతాపదినాలుగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సంతాపదినాలకు సూచనగా రాష్ట్రపతి భవన్, కేంద్ర సెక్రటేరియట్, పార్లమెంట్ భవనం తదితర కీలక కార్యాలయాల్లో జాతీయ జెండాను సగం వరకు అవతనం చేశారు.
సంతాప దినాలు పాటించే ఈ ఏడు రోజులూ(ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 6 వరకు) అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో జాతీయ జెండాను అవతనం(సగం కిందికి దించి) చేసి ఉంచుతారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) సోమవారం సాయంత్రం కన్నుమూశారు. ప్రణబ్ మరణవార్తను తొలుత ఆయన కుమారుడు అభిజిత్ ముఖర్జీ ట్విటర్ లో వెల్లడించారు. అనంతరం రాజకీయ నేతలు, ప్రముఖులు, విదేశీ నేతలు మొదలుకొని సామాన్య ప్రజల వరకు సంతాపం ప్రకటించారు.

దేశం ఓ ముద్దుబిడ్డను కోల్పోయిందని, ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి భవన్ ను ప్రజలకు మరింత చేరువ చేసిన ఘనత ప్రణబ్ ముఖర్జీదని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన సంతాప ప్రకటనలో పేర్కొన్నారు. భారతరత్న ప్రణబ్ మరణవార్త విని యావత్ దేశం విలపిస్తున్నదిని, దేశాభివృద్ధిలో ఆయనది చెరగని ముద్ర అని ప్రధాని నరేంద్ర మోదీ కీర్తించారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications