తన రాజకీయ పార్టీ ప్రారంభ తేదీని ప్రకటించిన ప్రశాంత్ కిశోర్

పాట్నా: ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) తన రాజకీయ పార్టీపై తాజాగా కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం చేపడుతున్న 'జన్ సురాజ్ యాత్ర'ను రాజకీయ పార్టీగా మలచనున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు తన పార్టీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. పాట్నాలో నిర్వహించిన 'జన్ సురాజ్' రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ప్రశాంత్ కిశోర్ మాట్లాడారు.

వచ్చే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేస్తామని పేర్కొన్నారు. పార్టీ నాయకత్వం వంటి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ మనవరాలు జాగృతి ఠాకూర్, తదితరులు హాజరయ్యారు. కాగా, బీహార్‌లో రెండేళ్ల క్రితం జన్ సురాజ్ యాత్రను ప్రశాంత్ కిశోర్ ప్రారంభించిన విషయం తెలిసిందే.

Prashant Kishor has announced the launch date of his political party

భారత రాజకీయాల్లో తన వ్యూహాత్మక చతురతకు పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ ప్రచారానికి చోదక శక్తిగా ఎదిగారు. బీహార్‌లో పరివర్తనాత్మక మార్పు తీసుకురావాలనే దృక్పథంతో ప్రారంభించి ఈ ప్రచారం అట్టడుగు స్థాయిలో ప్రజలతో మమేకమై, విద్య, వైద్యం, ఉపాధి వంటి కీలక సమస్యలను పరిష్కరించడంపై దృష్టి సారించింది.

ముఖ్యమంత్రి నితీష్ కుమార్ భారీ అధికార వ్యతిరేకతను ఎదుర్కొంటున్న తరుణంలో జన్ సూరాజ్ పార్టీ ఏర్పాటుతో 2025 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రశాంత్ కిశోర్. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ పైనా ప్రశాంత్ కిషోర్ విమర్శలు ఎక్కుపెట్టారు. 'బీహార్‌లో బలమైన రాజకీయ పార్టీగా చెప్పుకునే ఆర్జేడీ.. జన్ సూరాజ్ రాజకీయ పార్టీగా అవతరించనుందనే ప్రకటనతో గందరగోళాన్ని పెంచుకుంది' అని జన్ సురాజ్ తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+