ఢిల్లీలో దారుణం: ఐదు నెలల గర్భిణీపై దాడి చేశారు..ఎందుకంటే..?
న్యూఢిల్లీ: చిన్న పిల్లలను కిడ్నాప్ చేస్తోందంటూ ఓ గర్భవతిపై స్థానికులు దాడి చేసిన ఘటన ఈశాన్య ఢిల్లీ హర్ష్విహార్లో చోటుచేసుకుంది. మూగ చెవుడు ఉన్న బాధితురాలు ప్రియాంకా ఆగష్టు 27న ఓ చిన్నారిని కిడ్నాప్ చేసిందంటూ స్థానికులు ఆమెపై దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పోలీసులు దీపక్, శకుంతల, లలిత్ కుమార్ అనే ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఐదు నెలల గర్భిణీపై స్థానికుల దాడి
కొన్ని నెలల క్రితం చిన్నపిల్లలను కిడ్నాప్ చేసేవారు తిరుగుతున్నారంటూ అనుమానం వచ్చిన వారిపై స్థానికులు దాడి చేసిన ఘటనలు ఉత్తర్ప్రదేశ్లో చాలా చూశాం. ఒక్క ఉత్తర్ ప్రదేశ్లోనే 20 కేసులు నమోదయ్యాయి. ఇక తాజా ఘటనలో ప్రియాంకా అనే మహిళపై దాడి చేయడం జరిగింది. ఆమె 5 నెలల గర్భిణీ. ప్రియాంకపై స్థానికులు దాడి చేయడంతో గాయపడిన ఆమెను ఢిల్లీలోని సఫ్దార్జంగ్ హాస్పిటల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
వీడియో వైరల్ అవడంతో వెలుగులోకి అసలు విషయం
గతేడాది తన సోదరి ప్రియాంకకు వివాహం అయ్యిందని ఈ మధ్యనే సౌత్ ఈస్ట్ ఢిల్లీలోని తుగ్లకాబాద్ నుంచి ఫరీదాబాదుకు ఇల్లు మారిందని సందీప్ కుమార్ తెలిపాడు. ఆమె కనిపించకుండా పోవడంతో ప్రియాంకా తల్లిదండ్రులు తమ దృష్టికి తీసుకురావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అనంతరం ఓ పది రోజుల తర్వాత ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందని అందులో ఓ మహిళను కొందరు స్థానికులు దాడి చేయడాన్ని తన స్నేహితుడు గుర్తించి తన దృష్టికి తీసుకురావడంతో అసలు సంగతి వెలుగు చూసిందని చెప్పాడు సందీప్. ఇదే విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకురావడంతో ప్రియాంకను గుర్తించి తమకు అప్పగించారని చెప్పాడు.

ప్రియాంకపై 5 నుంచి 10 మంది వ్యక్తులు దాడి
ఇక వీడియోలో ప్రియాంకపై ఓ 5 నుంచి 10 మంది దాడి చేస్తున్నట్లు ఉంది. అంతేకాదు పిల్లలను కిడ్నాప్ చేస్తావా అంటూ స్థానికులు ప్రశ్నించడం ఆ వీడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. ముగ్గురు వ్యక్తులు ఆమె తలపై దాడి చేయడం స్పష్టంగా కనిపిస్తోంది. ముందుగా చిన్నపిల్లలకు డబ్బులు ఆశ చూపించి అనంతరం వారిని కిడ్నాప్ చేస్తుందని స్థానికులు ఆరోపించారు. తను నిరపరాధినని తనకేమి తెలియదని ప్రియాంకా వేడుకోవడం కనిపించింది. హర్ష్ విహార్లో దాడికి సంబంధించి సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్నామని పోలీసులు తెలిపారు. అక్కడ బాధితురాలు ఉందని చెప్పారు. అయితే విచారణలో ఆమెపై స్థానికులు చేసిన ఆరోపణలు అవాస్తవమని తేలినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే మహిళను షెల్టర్ హోంకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
వీడియోలో కనిపిస్తున్న ఇతరులను కూడా వెంటనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. ఆగష్టు 17న ప్రియాంకా తన ఇంటి నుంచి తప్పిపోయిందని పోలీసులు తెలిపారు. అదే రోజున ఆమె అదృశ్యమైనట్లు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైందని వెల్లడించారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications