దేశ ప్రజలకు ప్రణబ్ శుభాకాంక్షలు: పార్లమెంట్పై ఆవేదన
న్యూఢిల్లీ: భారత ప్రజాస్వామ్య వ్వవస్ధపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. 69వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా దేశ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
ఆర్థిక సంస్కరణల ప్రక్రియ కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. భారత్కు పటిష్టమైన రాజ్యాంగం ఉందని ఆయన పేర్కొన్నారు. మన ప్రజాస్వామ్య వ్యవస్ధపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయని చెప్పారు. పార్లమెంట్లో తరచూ ఘర్షణలు జరుగుతున్నాయని చెప్పిన ఆయన, పార్లమెంట్ సజావుగా జరగక పోడవం దురదృష్టకరమని అన్నారు

భారతీయల ఆత్మగౌరవం కోసం స్వాతంత్ర్య ఉద్యమం చేశామని దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఆదర్శాల కోసం మనం అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అత్యంత విలువైందని పేర్కొన్నారు.
భారత ప్రజాస్వామ్యం విలువులతో కూడుకుని ఉందని అన్నారు. దేశాభివృద్ధిని మనం పాటించే విలువల ద్వారా చూపించొచ్చని అభిప్రాయపడ్డారు. నోబెల్ పురస్కారం గ్రహీత కైలాస్ సత్యార్ధికి ఆయన అభినందనలు తెలిపారు.












Click it and Unblock the Notifications