వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకీ సతీవియోగం
ఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి, భారత ప్రథమ మహిళ సువ్రా ముఖర్జీ కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె దేశ రాజధాని న్యూఢిల్లీలోని సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు.
ఉదయం పది గంటల యాభై నిమిషాలకు ఆమె తుది శ్వాస విడిచారు. గతవారంలో ఆమె అస్వస్థతకు లోనవడంతో వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. నాటి నుంచి ఐసీయూలోనే ఉంచి చికిత్స అందిస్తున్నారు.
అయితే అప్పుడే సువ్రా ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యుల ద్వారా తెలిసింది. సువ్రా ముఖర్జీని ఈ నెల 7వ తేదీన ఆసుపత్రిలో చేర్పించారు. సువ్రా ముఖర్జీ పూర్వీకులు బంగ్లాదేశ్లోని నర్హాలీ జిల్లాకు చెందినవారు.
Comments
English summary
President Pranab Mukherjee's wife Suvra Mukherjee passed away today due to respiratory failure.
Story first published: Tuesday, August 18, 2015, 11:40 [IST]