చర్లపల్లి జైల్లో టీ20 క్రికెట్ పోటీలు: సత్యం రామలింగ రాజు దూరం
హైదరాబాద్: సత్యం కుంభకోణం కేసులో జైలులో ఉన్న రామలింగ రాజు మంగళవారం నాడు.. ఇతర ఖైదీలు క్రికెట్ ఆడుతుంటే, ఆయన మాత్రం మ్యాచ్కు దూరంగా ఉన్నారట. ప్రస్తుతం దేశంలో అందరు క్రికెట్ వర్షంలో మునిగిపోతున్నారు. ఐపీఎల్ 8 అందర్నీ రంజింప చేస్తోంది.
ఈ నేపథ్యంలో చర్లపల్లి జైలులో మంగళవారం నాడు తొలిసారి ట్వంటీ20 క్రికెట్ నిర్వహించారు. ఈ మ్యాచ్కు రామలింగ రాజు సహా సత్యం కేసు దోషులు దూరంగా ఉన్నారని తెలుస్తోంది.

చర్లపల్లి జైలులో క్రికెట్ మ్యాచ్ ఏదో మొక్కుబడిగా ఆడించలేదంటున్నారు. ఆటలో కాంపిటేటివ్ స్పిరిట్ కనిపించిందంటున్నారు. తెలంగాణలోని చర్లపల్లి జైలులో క్రికెట్ ఆట ఇదే తొలిసారి. ఎవరు ఎవరికి మద్దతివ్వాలనే విషయమై ఖైదీలను అధికారులు విభజించలేదు. ఎవరికి నచ్చిన వారిని వారు చీర్ చేసుకునే అవకాశం కల్పించారు.
జైలులో మొత్తం 943 మంది ఉన్నారు. వరంగల్ సెంట్రల్ జైలు టీమ్ ట్వంటీ 20 క్రికెట్ కప్ను గెలుచుకుంది. గెలుపొందిన వారికి మంగళవారం సాయంత్రం బహుమతులు అందజేశారు. గత కొద్ది రోజులుగా తెలంగాణలోని జైలులో క్రికెట్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వరంగల్, చర్లపల్లి జైలు ఖైదీలు ఫైనల్కు చేరారు.
20వ తేదీకి వాయిదా
సత్యం కుంభకోణం కేసులో దోషులుగా నిర్ధారితమైన రామలింగ రాజు, ఆయన సోదరుడు రామరాజు, ఇతరులు నాంపల్లి కోర్టులో అప్పీల్ చేసిన విషయం తెలిసిందే. వాదనలు పూర్తయ్యాయి. దోషుల అప్పీల్ విచారణ అర్హత పైన తీర్పును 20వ తేదీకి వాయిదా వేసింది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications