మీటూ క్యాంపెయిన్: ఎంజే అక్బర్ కేసులో జర్నలిస్టు ప్రియా రమణికి బెయిల్ మంజూరు
కేంద్రమాజీ మంత్రి ఎంజే అక్బర్ ప్రముఖ జర్నలిస్టు ప్రియా రమణిపై వేసిన కేసులో ఆమెకు ఊరట లభించింది. ఢిల్లీ హైకోర్టు ప్రియా రమణికి బెయిల్ మంజూరు చేసింది. రూ. 10వేలు పూచీకత్తుతో ప్రియా రమణికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తూ వచ్చే నెల 8కి కేసును వాయిదావేసింది.
వచ్చేనెలలో కేసు విచారణ సందర్భంగా తనపై ఆరోపణలు చేస్తారని ఆ తర్వాత ఏప్రిల్ 10న మళ్లీ విచారణకు వచ్చే సమయంలో తను చెప్పాల్సింది న్యాయస్థానానికి చెబుతానని ప్రియారమణి తెలిపారు. గతేడాది మీటూ క్యాంపెయిన్లో భాగంగా లైంగిక వేధింపులపై మాట్లాడుతూ కేంద్ర మాజీ మంత్రి అక్బర్పై ఆరోపణలు చేశారు. 1990వ దశకంలో అక్బర్తో కలిసి తాను పనిచేసినట్లు చెప్పారు. ఈమెతో పాటు గజాలా వాహబ్, షూమా రాహ, అంజు భారతి, షుతపా పాల్ కూడా పనిచేసినట్లు ఆమె చెప్పారు.
Journalist Priya Ramani after being granted bail by Patiala House Court in connection with criminal defamation complaint by MJ Akbar: The next date when they will frame the charges against me is April 10. After that it will be my turn to tell my story. The truth is my defence. pic.twitter.com/mxRadNVYua
— ANI (@ANI) February 25, 2019

కేసు విచారణ చేసిన కోర్టు తనపై రమణి చేసిన ఆరోపణలు సత్యదూరమని, ఊహాజనితమైనవని అక్బర్ ఫిర్యాదు చేశారని.. అయితే అది ప్రాథమిక ఫిర్యాదుగానే చూస్తున్నామని చెప్పింది కోర్టు. పూర్తి స్థాయి విచారణ జరిగే వరకు జర్నలిస్టు ప్రియారమణికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. 20 ఏళ్ల క్రితం అక్బర్ తనను లైంగికంగా వేధించారని ప్రియా రమణి ఆరోపణలు చేసింది. ఆ సమయంలో ఇద్దరూ జర్నలిస్టులుగా పనిచేసేవారు. అయితే ప్రియారమణి ఆరోపణల్లో వాస్తవం లేదని అక్బర్ వెల్లడించారు. అక్బర్పై ఆరోపణలు రావడంతో తన కేంద్రమంత్రి పదవికి గతేడాది అక్టోబర్ 17న రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆమెపై పరువునష్ట దావా వేశారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications