రాహుల్ గాంధీతో గేమ్స్, జేపీ నడ్డా, మాన్వియా మీద కేసు పెట్టిన ప్రియాంక్ ఖార్గే !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని కదలించడానికి అవకాశం లేకుండా ఆ పార్టీ 135 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కర్ణాటక ఐటీ, బీటీ శాఖా మంత్రి ప్రియాంక్ ఖార్గే బీజేపీ నాయకుల మీద కేసు పెట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా, బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా, బీజేపీ చండీగఢ్ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ సూద్ ల మీద మంత్రి ప్రియాంక్ ఖార్గే కేసు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు, మా ప్రియతమ నేత రాహుల్ గాంధీ పరువుకు భంగం కలిగించేలా ఆయన ప్రసంగాలను మార్ఫింగ్ చేసిన బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా, చండీగఢ్ బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సూద్ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి వాటిని వైరల్ చేశారని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు.

బీజేపీ ఐటీ సెల్ విభాగం చీఫ్ అమిత్ మాల్వియా వైరల్ చేసిన వీడియోలో రాహుల్ గాంధీ ఓ ప్రమాదకరమైన వ్యక్తి అంటూ వ్యాఖ్యానిస్తూ త్రీడీ యానిమేటెడ్ వీడియో తయారు చేశారని ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు. వీళ్లు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తయారు చేసిన ఆ వీడియోను జేపీ నడ్డా కూడా ఆ వీడియో షేర్ చెయ్యడంతో అది వైరల్ అయ్యిందని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు.

జూన్ 17వ తేదీన బీజేపీ ఐటీ సెల్ విభాగం చీఫ్ అమిత్ మాల్వియా సోషల్ మీడియాలో రాహుల గాంధీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ మనోభావాలు దెబ్బ తియ్యడానికి వీడియో పోస్టు చేశారని, ఆ వీడియోను బీజేపీ నాయకులు వైరల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు తీసుకువానికి జేపీ నడ్డా, అమిత్ మాన్వియా, అరుణ్ సూద్ ప్రయత్నాలు చేస్తున్నారని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు.
రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపించి ప్రజల్లో తప్పుడు సంకేతాలు తీసుకువెలుతున్నారని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు. ఇస్లామిక్ నేతలతో రాహుల్ గాంధీ మాట్లాడారని, రాహుల్ గాంధీ దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని బీజేపీ నాయకులు తప్పుగా ప్రచారం చేస్తున్నారని ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు.

రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుల మనోభావాలు దెబ్బతినేలా వీరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని, రాహుల్ గాంధీ ప్రతిష్టను దెబ్బ తియ్యడానికి ప్రయత్నిస్తున్నారని, జేపీ నడ్డా, అమిత్ మాల్వియా, అరుణ్ సూద్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తూ కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖార్గే బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. మంత్రి ప్రియాంక్ ఖార్గే ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేసి విచారణ చేస్తున్నామని బెంగళూరు పోలీసులు అంటున్నారు.
-
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత












Click it and Unblock the Notifications