రాహుల్ గాంధీతో గేమ్స్, జేపీ నడ్డా, మాన్వియా మీద కేసు పెట్టిన ప్రియాంక్ ఖార్గే !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటకలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని కదలించడానికి అవకాశం లేకుండా ఆ పార్టీ 135 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కర్ణాటక ఐటీ, బీటీ శాఖా మంత్రి ప్రియాంక్ ఖార్గే బీజేపీ నాయకుల మీద కేసు పెట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ. నడ్డా, బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా, బీజేపీ చండీగఢ్ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ సూద్ ల మీద మంత్రి ప్రియాంక్ ఖార్గే కేసు పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు, మా ప్రియతమ నేత రాహుల్ గాంధీ పరువుకు భంగం కలిగించేలా ఆయన ప్రసంగాలను మార్ఫింగ్ చేసిన బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా, చండీగఢ్ బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సూద్ ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి వాటిని వైరల్ చేశారని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు.

బీజేపీ ఐటీ సెల్ విభాగం చీఫ్ అమిత్ మాల్వియా వైరల్ చేసిన వీడియోలో రాహుల్ గాంధీ ఓ ప్రమాదకరమైన వ్యక్తి అంటూ వ్యాఖ్యానిస్తూ త్రీడీ యానిమేటెడ్ వీడియో తయారు చేశారని ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు. వీళ్లు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా తయారు చేసిన ఆ వీడియోను జేపీ నడ్డా కూడా ఆ వీడియో షేర్ చెయ్యడంతో అది వైరల్ అయ్యిందని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు.

జూన్ 17వ తేదీన బీజేపీ ఐటీ సెల్ విభాగం చీఫ్ అమిత్ మాల్వియా సోషల్ మీడియాలో రాహుల గాంధీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ మనోభావాలు దెబ్బ తియ్యడానికి వీడియో పోస్టు చేశారని, ఆ వీడియోను బీజేపీ నాయకులు వైరల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి చెడ్డపేరు తీసుకువానికి జేపీ నడ్డా, అమిత్ మాన్వియా, అరుణ్ సూద్ ప్రయత్నాలు చేస్తున్నారని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు.
రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యక్తిత్వాన్ని తప్పుగా చూపించి ప్రజల్లో తప్పుడు సంకేతాలు తీసుకువెలుతున్నారని కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు. ఇస్లామిక్ నేతలతో రాహుల్ గాంధీ మాట్లాడారని, రాహుల్ గాంధీ దేశవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని బీజేపీ నాయకులు తప్పుగా ప్రచారం చేస్తున్నారని ప్రియాంక్ ఖార్గే ఆరోపించారు.

రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుల మనోభావాలు దెబ్బతినేలా వీరు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని, రాహుల్ గాంధీ ప్రతిష్టను దెబ్బ తియ్యడానికి ప్రయత్నిస్తున్నారని, జేపీ నడ్డా, అమిత్ మాల్వియా, అరుణ్ సూద్ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆరోపిస్తూ కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖార్గే బెంగళూరులోని హైగ్రౌండ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. మంత్రి ప్రియాంక్ ఖార్గే ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేసి విచారణ చేస్తున్నామని బెంగళూరు పోలీసులు అంటున్నారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications