వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మమ్మల్నీ తనిఖీ చేయొచ్చు: ఎస్పిజికి ప్రియాంక లేఖ

|
Google Oneindia TeluguNews

Priyanka Gandhi seeks withdrawal of special security at airports
న్యూఢిల్లీ: విమానాశ్రయాల్లో తనిఖీలకు సంబంధించి తనకు, తన కుటుంబానికి ఎలాంటి మినహాయింపులు అవసరం లేదని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. సాధారణ సెక్యూరిటీ తనిఖీల విషయంలో ఇస్తున్న మినహాయింపులను ఉపసంహరించాలని స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పిజి)కి ఆమె శుక్రవారం లేఖ రాశారు.

ప్రస్తుతం విఐపి జాబితాలో ఉన్న ప్రియాంక గాంధీ, ఆమె భర్త రాబర్ట్ వాద్రాకు విమానాశ్రయాల్లో ఎలాంటి తనిఖీలు లేకుండా ప్రత్యేక మినహాయింపులు వర్తిస్తున్నాయి. విమానాశ్రయాల్లో తనిఖీల సందర్భంగా తన భర్త రాబర్ట్ వాద్రాకు ఇస్తున్న మినహాయింపులను రద్దు చేసే అవకాశాలున్నట్లు వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ.. ఆమె ఎస్పిజి సారథి దుర్గాప్రసాద్‌కు లేఖ రాశారు.

వాద్రాకు ఈ తరహా మినహాయింపులివ్వాల్సిందిగా తామెవ్వరమూ అడగలేదనీ.. అప్పటి ఎస్పిజి సారథులు, ఢిల్లీ పోలీసులు తీసుకున్న నిర్ణయమేననీ ఆమె తన లేఖలో పేర్కొన్నారు. మామూలు ప్రయాణికుల్లాగానే తమనూ విమానాశ్రయాల్లో తనిఖీ చేయవచ్చునని ప్రియాంక తెలిపారు.

కాగా, దీనిపై ఎస్పిజి వర్గాలు స్పందించాయి. భద్రత ఉపసంహరణ అనేది ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక ఆధారంగా జరుగుతుందని తెలిపాయి.

English summary

 Reacting to reports that her husband Robert Vadra may no longer get an exemption from being frisked at airports, Priyanka Gandhi Vadra shot off a letter to the Special Protection Group chief, Durga Prasad, on Friday demanding that the withdrawal of privileges be implemented immediately for her entire family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X