ఇందిరా గాంధీని గుర్తు చేస్తున్న ప్రియాంకా గాంధీ, మేడమ్ మాటలతో !
బెంగళూరు/మైసూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా జాతీయ పార్టీ నాయకులు కర్ణాటకలో మకాం వేస్తున్నారు. ఎలాగైనా అధికారం సొంతం చేసుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఓటర్ల నాడి ఏమిటి అని రెండు పార్టీల నాయకులతో పాటు జేడీఎస్ పార్టీ కూడా గుర్తించలేపోయింది.
కర్ణాటకలో ఇంతకాలం అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు మరోసారి అధికారంలోకి రావాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫోటో పెట్టుకుని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిపోతామని చాలా మంది నాయకులు అనుకుంటున్నారు. అయితే పరిస్థితులు ఎలా ఉంటాయో మాత్రం కొందరు నాయకులు ఊహించలేకపోతున్నారు.

అయితే ఇలాంటి సమయంలో ప్రియాంకా గాంధీ కర్ణాటకలో చేపట్టిన ఎన్నికల ప్రచారానికి ఊహించని మద్దతు వస్తోంది. మంగళవారం మైసూరు. చామరాజనగర జిల్లాల్లో ప్రియాంకా గాంధీ ఎన్నికల ప్రాచారం చేశారు. ఈ సందర్బంగా మహిళలతో ప్రియాంకా గాంధీ ప్రత్యేక సమావేశాలు, చర్చలు జరిపారు.
మీ నానమ్మ ఇందిరా గాంధీని చూసినట్లు ఉందని చాలా మంది మహిళలు చెప్పడంతో ప్రియాంకా గాంధీ చాలా సంతోషంతో పులకించిపోయారు. ఇందిరా గాంధీ పేద ప్రజలను ఎలా ఆదుకున్నారో అలాగే మీరు కూడా మా ప్రాంత ప్రజలను ఆదుకోవాలని హానూరు నియోజక వర్గం ప్రజలు ప్రియాంకా గాంధీకి మనవి చేశారు.

కర్ణాటకలో త్వరలో మన ప్రభుత్వం (కాంగ్రెస్) వస్తుందని, తరువాత మీ సమస్యలు మొత్తం పరిష్కరించడానికి మేము అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని, నెల రోజులు మీరు ఓపిక పట్టాలని ప్రియాంకా గాంధీ స్థానిక ప్రజలు హామీ ఇచ్చారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకా గాంధీ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్లస్ పాయింట్ అవుతున్నది.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications