నువుర్ శర్మ వివాదం- అసదుద్దీన్ ఓవైసీకీ ఢిల్లీ పోలీసుల ఝలక్-రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు
మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మపై కేసులు వెంటాడుతున్నాయి. అదే సమయంలో ఆమెపై వ్యాఖ్యలు చేసిన వివాదంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కూడా ఇరుక్కున్నారు. ఢిల్లీ పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఢిల్లీ పోలీసులు నిన్న సంచలన వ్యాఖ్యలపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పేరు కూడా పెట్టారు. ఎఫ్ఐఆర్లో స్వామి యతి నర్సింహానంద్ పేరును కూడా ప్రస్తావించారు. సస్పెండ్ అయిన బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగడంతో ఇది ప్రపంచ దేశాల్లో ఆగ్రహానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోరీసులు చర్యలు చేపట్టారు. ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్లో తొలుత నుపుర్ శర్మ పేరును కూడా చేర్చగా, మరో ఎఫ్ఐఆర్లో సస్పెండైన బిజెపి నేత నవీన్ జిందాల్, జర్నలిస్ట్ సవా నఖ్వీతో సహా పలువురి పేర్లు ఉన్నాయి.

ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకూ ఈ వ్యవహారంలో రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇందులో ఒకటి నుపుర్ శర్మపై, మరొకటి మరొకటి నిరంతరం "వివాదాస్పద" ప్రకటనలు చేస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఉంది.
మొదటి ఎఫ్ఐఆర్లో నుపుర్ శర్మ, రెండో ఎఫ్ఐఆర్లో నవీన్ జిందాల్, షాదాబ్ చౌహాన్, సబ్ నఖ్వీ, మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుర్ రెహ్మాన్, గుల్జార్ అన్సారీ, అనిల్ కుమార్ మీనా పేర్లు ఉన్నాయి. పోలీసులు నూపుర్ శర్మపై సెక్షన్ 153 (అల్లర్లు సృష్టించాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టడం), 295 (ఏదైనా వర్గానికి చెందిన మతాన్ని అవమానించే ఉద్దేశ్యంతో ప్రార్థనా స్థలాన్ని గాయపరచడం లేదా అపవిత్రం చేయడం), మరియు 505 (ప్రజా దుర్మార్గానికి దారితీసే ప్రకటనలు) కింద కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications