సుష్మ అడుగుజాడల్లో నడవడం గర్వంగా ఉంది : జై శంకర్
న్యూఢిల్లీ : కీలకమైన విదేశాంగ శాఖ మంత్రి పదవీ చేపట్టిన సుబ్రమణ్యం జై శంకర్ .. మాజీ మంత్రి సుష్మ అడుగుజాడల్లో నడుస్తానని ప్రకటించారు. విదేశాంగ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఫస్ట్ టైం ట్వీట్ చేశారు. తనకు సుష్మపై ఎనలేని గౌరవం ఉందని స్పష్టంచేశారు.
కీలక శాఖ ...
మోడీ 2.0లో జై శంకర్ కు కీలకశాఖ దక్కింది. విదేశాంగ శాఖ మంత్రి పదవీ కట్టబెట్టారు. ఈ క్రమంలో ఆయనకు అభినందనలు వెల్లువెత్తాయి. తనపై ఇంత పెద్ద భారం ఉంచిన మోడీ ధన్యవాదాలు తెలిపారు. తనపై అభిమానం చూసి అభినందనలు తెలిపిన వారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. సుష్మ స్వరాజ్ అడుగు జాడల్లో నడవడం తనకు గర్వంగా ఉందన్నారు. మోడీ తొలి క్యాబినెట్ లో సుష్మ .. విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రవాసీల కోసం విశేషంగా పనిచేయడంతో ఆమెను అందరూ అమ్మ అని పిలుస్తారు. అయితే అనారోగ్య సమస్యలతో ఆమె మళ్లీ క్యాబినెట్ లో చేరలేదు. దీంతో విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసి రిటైరైన జై శంకర్ కు ప్రమోషన్ వచ్చింది. ఏకంగా క్యాబినెట్ పోర్టు పోలియో దక్కింది. అయితే ఆ పదవీ ఆయన సమర్థతకు నిదర్శనం అనే వారు ఉన్నారు.

ఫస్ట్ పర్సన్
1977 ఐఎఫ్ఎస్ బ్యాచ్ కు చెంది జై శంకర్ కు మంచి బ్యూరోక్రాట్ గా గుర్తింపు ఉంది. మోడీ హయాంలో విదేశాంగ శాఖ కార్యదర్శిగా విశేష సేవలు అందించారు జై శంకర్. కేంద్రమంత్రి బాధ్యతలు చేపట్టిన జై శంకర్ ... విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే ఘనస్వాగతం పలికారు. విదేశాల్లో భారతదేశ సంబంధాలు మరింత మెరుగుపరచడంపై మోడీ దృష్టిసారించారు. ఆ నేపథ్యంలోనే సమర్ధుడైన జై శంకర్ కు పదవీ కట్టబెట్టారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
విదేశాంగ శాఖ కార్యదర్శి పనిచేసి .. విదేశాంగ మంత్రిగా పనిచేస్తోన్న మొదటి వ్యక్తిగా జై శంకర్ రికార్డు సృష్టించారు. ఇదివరకు నట్వర్ సింగ్ కూడా ఐఎఫ్ ఎస్ చేసి 1980లో ఉద్యోగానికి రాజీనామా చేశారు. తర్వాత 2004 నుంచి 2005 వరకు విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశారు. కానీ పదవీ నుంచి రిటైరై .. విధులు నిర్వర్తిస్తున్న తొలి వ్యక్తి మాత్రం జై శంకర్ కావడం విశేషం.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications