మోసగాళ్లకు చెక్ చెప్పేందుకు రంగంలోకి కేంద్రం: రూ.50 కోట్ల లోన్ దాటితే..
న్యూఢిల్లీ: విజయ్ మాల్యా, నీరవ్ మోడీ.. ఇలా బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్నారు. ఇలాంటి అక్రమాలను నివారించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది.
ఇందులో భాగంగా రూ.50 కోట్ల కంటే ఎక్కువ రుణాలు తీసుకునే వారి పాస్పోర్టు వివరాలను తీసుకోవాలని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్రం ఆదేశించనుంది.

ఇందుకు సంబంధించిన బిల్లును కేంద్రం ఈ బడ్జెట్ సమావేశాల్లో తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం ఈ బిల్లు చర్చల దశలో ఉందని తెలుస్తోంది.
బ్యాంకులు, నిఘా సంస్థలు, ఇతర ప్రభుత్వ విభాగాల మధ్య మరింత సమన్వయం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, ఎవరి ఖాతాలోనైనా మోసపూరిత లావాదేవీలు ఉన్నాయని బ్యాంకు గుర్తిస్తే వెంటనే సంబంధిత ఏజెన్సీకి తెలియజేయవచ్చునని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications