శశికళకు రాచమర్యాదలు, రూప బదిలి, కిరణ్ బేడి ఫైర్, ఇదేనా మీరు ఇచ్చే మర్యాద?
బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార కర్మకాండ గురించి ప్రభుత్వానికి, పై అధికారులకు లేఖ రాయడం వలనే డీఐజీ రూపను బదిలి చేశారని పుద్దుచ్చేరి గవర్నర్, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడి మండిపడ్డారు.
నిజాయితీగా పని చెయ్యడం వలనే డీఐజీ రూపను కర్ణాటక ప్రభుత్వం బదిలి చేసిందని కిరణ్ బేడి విమర్శించారు. రూప లాంటి ఐపీఎస్ అధికారులు భారతదేశానికి ఎంతో అవసరం అని కిరణ్ బేడి గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రూపను బదిలి చెయ్యడం మీకు అవసరమా ? అని కర్ణాటక ప్రభుత్వాన్ని కిరణ్ బేడి ప్రశ్నించారు.

మంగళవారం గవర్నర్ కిరణ్ బేడి కర్ణాటక ఐపీఎస్ అధికారిణి రూప బదిలి విషయంపై వరుసగా ట్వీట్ లు చేశారు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు విషయంలో రూప ఆరోపణలు చేసిన తరువాత అసలు విషయాలు బయటకు వస్తున్నాయని కిరణ్ బేడి గుర్తు చేశారు.
పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు రాచమర్యాదలు చేస్తున్నారని రూప బయటకు చెప్పిన తరువాతే అసలు విషయం వెలుగు చూసింది ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లు మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయానికి, కేంద్ర హోం శాఖ కార్యాయానికి ట్యాగ్ చేసి రూప బదిలి విషయంపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.












Click it and Unblock the Notifications