శశికళకు రాచమర్యాదలు, రూప బదిలి, కిరణ్ బేడి ఫైర్, ఇదేనా మీరు ఇచ్చే మర్యాద?
బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార కర్మకాండ గురించి ప్రభుత్వానికి, పై అధికారులకు లేఖ రాయడం వలనే డీఐజీ రూపను బదిలి చేశారని పుద్దుచ్చేరి గవర్నర్, మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడి మండిపడ్డారు.
నిజాయితీగా పని చెయ్యడం వలనే డీఐజీ రూపను కర్ణాటక ప్రభుత్వం బదిలి చేసిందని కిరణ్ బేడి విమర్శించారు. రూప లాంటి ఐపీఎస్ అధికారులు భారతదేశానికి ఎంతో అవసరం అని కిరణ్ బేడి గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రూపను బదిలి చెయ్యడం మీకు అవసరమా ? అని కర్ణాటక ప్రభుత్వాన్ని కిరణ్ బేడి ప్రశ్నించారు.

మంగళవారం గవర్నర్ కిరణ్ బేడి కర్ణాటక ఐపీఎస్ అధికారిణి రూప బదిలి విషయంపై వరుసగా ట్వీట్ లు చేశారు. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు విషయంలో రూప ఆరోపణలు చేసిన తరువాత అసలు విషయాలు బయటకు వస్తున్నాయని కిరణ్ బేడి గుర్తు చేశారు.
పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు రాచమర్యాదలు చేస్తున్నారని రూప బయటకు చెప్పిన తరువాతే అసలు విషయం వెలుగు చూసింది ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లు మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయానికి, కేంద్ర హోం శాఖ కార్యాయానికి ట్యాగ్ చేసి రూప బదిలి విషయంపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications