పులిట్జర్ ఫ్రైజ్ విజేతకు అవమానం.. ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఆపి..
పులిట్జర్ ప్రైజ్ విజేత సనా ఇర్షిద్ మట్టుకు అవమానం జరిగింది. ఢిల్లీ ఎయిర్ పోర్టులో సిబ్బంది ఆమెను ఆపారు. సనా కశ్మీర్ ఫోటో జర్నలిస్ట్ కావడం విశేషం. శనివారం ఆమె ఫ్రాన్స్ వెళ్లాల్సి ఉండగా.. ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలిపివేశారు. ప్యారిస్లో ఆమె బుక్ లంచ్, ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ కోసం వెళుతున్నారు. అయితే తనను ఏ కారణం చెప్పకుండా ఆపివేశారని పేర్కొన్నారు.
సెరెండిపిటీ ఏరిస్ గ్రాంట్ 2020లో 10 మంది అవార్డు విజేతలలో పుస్తకావిష్కరణ, ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ ఉంది. తనకు ఫ్రెంచ్ వీసా ఉంది.. కానీ ఢిల్లీలో మాత్రం ఆపారని వివరించింది. బోర్డింగ్ పాస్ రద్దు చేసిందని ఈ మేరకు ట్వీట్ చేసింది. అకారణంగా పర్మిషన్ ఇవ్వలేదని తెలిపింది. తాను అంతర్జాతీయంగా ప్రయాణించలేనా అని అడిగారు. అయితే సనా సహా ఇతర జర్నలిస్టులు.. అదే కశ్మీర్ లోయకు చెందిన వారు విదేశాలకు వెళ్లే వీలు లేదు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆమెను ఆపివేశారు.
2019 సెప్టెంబర్లో కశ్మీరీ జర్నలిస్ట్ గౌహర్ గీలానీ కూడా ఢిల్లీ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆపివేశారు. జర్మనీ వెళ్లేందుకు రాగా అడ్డుకున్నారు. గతేడాది కూడా జహీద్ రఫీక్కు కూడా నిలిపివేశారు. అమెరికాలో గల వర్సిటీలో క్లాసులు చెప్పేందుకు రాగా అడ్డుకున్నారు. అలాగే రువా షా, అహ్మిర్ ఖాన్ కూడా నిలిపివేశారు. మరొకరిని కూడా ఆపారు.. కానీ 6 నెలల తర్వాత మాత్రం పంపించివేశారు.
శ్రీనగర్కు చెందిన సనా.. రాయిటర్స్ వార్తా సంస్థకు ఫోటో జర్నలిస్టుా పనిచేస్తున్నారు. 2022లో ఆమె పుల్టిజర్ ఫ్రైజ్ గెలచుకున్నారు. మరో ఇద్దరితో కలిసి ఆమె అవార్డును అందుకున్నారు. వారు దేశంలో కరోనా సెకండ్ వేవ్ గురించి రిపోర్ట్ చేశారు. ఇప్పుడు ఇలా ఆమెకు అవమానం జరిగింది.