వివాహేతర సంబంధం: భర్త పురుషాంగాన్ని కోసేసిన భార్య
చండీగఢ్: పంజాబ్లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ మహిళ తన భర్త పురుషాంగాన్ని కోసేసింది. ఆ తర్వాత దానిని టాయిలెట్లో వేసేసింది.
ఈ సంఘటన జలంధర్లోని జోగిందర్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. తన భర్త నిద్రలో ఉన్న సమయంలో ఆమె ఈ పని చేసింది. అతని పేరు ఆజాద్ సింగ్. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.

ఈ సంఘటన మంగళవారమే చోటు చేసుకుంది. పోలీసులు మాట్లాడుతూ.. తన భర్తకు వేరే మహిళతో సంబంధం ఉన్న విషయం తెలిసిన భార్య తొలుత అతను నిద్రలో ఉన్నప్పుడు రాడ్డుతో కొట్టిందని, ఆ తర్వాత అతని మర్మాంగాన్ని కోసివేసిందని చెప్పారు.












Click it and Unblock the Notifications