ఆ వార్తల్లో నిజం లేదన్న రాధిక శరత్ కుమార్ .. చెక్ బౌన్స్ కేసులో కోర్టు తీర్పుపై స్పందన ఇదే !!
ఇటీవల చెక్ బౌన్స్ కేసులో చెన్నై కోర్టు ఏడాదిపాటు నటి రాధిక, తమిళ నటుడు శరత్ కుమార్ దంపతులకు జైలు శిక్ష విధించడంతో రాధిక శరత్ కుమార్ పేరు వార్తల్లోకి వచ్చింది. తమిళనాడు ఎన్నికలు ముగిసిన తరువాత ఊహించని విధంగా చెక్ బౌన్స్ కేసులో వీరికి కోర్టు షాక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే నటి రాధికకు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా వార్తలు కూడా పెద్ద ఎత్తున ప్రచారమయ్యాయి. ఇక ఈ నేపథ్యంలో రాధిక ట్విట్టర్ లో స్పందించారు .
రాధిక శరత్ కుమార్ లకు ఏడాది పాటు జైలు శిక్ష విధించిన చెన్నై ప్రత్యేక కోర్టు .. మ్యాటర్ ఏంటంటే !!
రాధికకు కరోనా పాజిటివ్ అంటూ ప్రచారం .. ఆమె ఏమన్నారంటే
రాధికా శరత్ కుమార్ తనపై కొందరు కావాలని వదంతులు సృష్టిస్తున్నారని, పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు అని సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇదే సమయంలో తనకు కరోనా సోకలేదని సందేశం ఇచ్చారు . ఆమె తన అభిమానులను ఉద్దేశించి వారి అభిమానానికి, వారి ప్రేమ మరియు ఆప్యాయతలకు కృతజ్ఞతలు తెలియజేశారు . కరోనా వ్యాక్సిన్ రెండవ మోతాదు తీసుకున్న తర్వాత ఆమెకు కాస్త ఒళ్లు నొప్పులు వచ్చాయని, అంతే తప్ప తాను ఎలాంటి కరోనా వైరస్ తో బాధ పడడం లేదని రాధిక వెల్లడించారు.
న్యాయం కోసం హయ్యర్ కోర్టును ఆశ్రయిస్తాం అన్న రాధిక
తాను ఆరోగ్యంగా ఉన్నానని , ఐయామ్ బ్యాక్ యట్ వర్క్ అని ట్వీట్ చేసిన రాధిక కాస్త వర్క్ బిజీలో ఉన్నానని అన్నారు. చెక్ బౌన్స్ కేసులో తీర్పు పై స్పందిస్తూ తాము న్యాయం కోసం హయ్యర్ కోర్టులో ఫైట్ చేస్తామని వెల్లడించారు. అంతేకాదు తన ఆరోగ్యంపై కోర్టు తీర్పుపై వదంతులు సృష్టించే వారికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. లీగల్ గా ఫైట్ చేస్తాం అంటూ హెచ్చరించారు రాధిక.
Recommended Video
చెక్ బౌన్స్ కేసులో రాధికా శరత్ కుమార్ లకు ఏడాది జైలు శిక్ష విధించిన కోర్టు
చెక్ బౌన్స్ కేసులో తమిళ నటుడు శరత్కుమార్, ఆయన భార్య, నటి రాధిక శరత్కుమార్లకు ఏడాది జైలు శిక్ష విధించినట్లు చెన్నైలోని ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది . చెన్నైలోని సైదాపేట కోర్టులో తమిళ నటుడు శరత్ కుమార్ కు, ఆయన భార్య రాధిక శరత్ కుమార్ కు 2017 నాటి చెక్ బౌన్స్ కేసులో ఇరువురికి న్యాయస్థానం ఏడాది పాటు శిక్ష విధించింది. రేడియన్ సంస్థ నుండి సినిమా నిర్మాణం కోసం అప్పు చేసిన రాధిక శరత్ కుమార్ ఇచ్చిన చెక్స్ బౌన్స్ అయిన కేసులో కోర్టు ఈ తీర్పునిచ్చింది .