శరద్ యాదవ్ వద్ద రాహుల్ మొహమాటం: వెంటనే అందుకున్న ఏచూరి
కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్ను ఓ విషయంపై అడిగేందుకు మొహమాటపడ్డారట. దీంతో అక్కడేవున్న సీపీఎం నేత సీతారాం ఏచూరి కల్పించుకుని రాహుల్ అడగాల
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్ను ఓ విషయంపై అడిగేందుకు మొహమాటపడ్డారట. దీంతో అక్కడేవున్న సీపీఎం నేత సీతారాం ఏచూరి కల్పించుకుని రాహుల్ అడగాలనుకున్నది అడిగేశారట.

శరద్ యాదవ్ సుదీర్ఘ ప్రసంగం
అసలు విషయంలోకి వెళితే.. మంగళవారం ప్రతిపక్షాలు భేటీ అయిన సందర్భంలో రైతు సమస్యలపైన చర్చించారు. ఈ సమస్యను ప్రజల్లోకి తీసుకెళ్లి మోడీ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో చెబుతూ కేంద్ర ప్రభుత్వాన్ని కార్నర్ చేయాలని భావించాయి. కాగా, ఈ సమావేశానికి హాజరైన శరద్ యాదవ్ రైతుల సమస్యలపై చాలా సేపు మాట్లాడారు.

రాహుల్ మొహమాటం
దీంతో అక్కడే ఉన్న రాహుల్ గాంధీతో సహా పలువురు నేతలకు ఓ సందేహం వచ్చింది. శరద్ యాదవ్ పార్టీ తరపున ఈ విషయం చెప్పారా? లేక వ్యక్తిగతంగా చెప్పారా? అని తెలుసుకోవాలనుకున్నాయి. నేరుగా ఈ విషయాన్ని అడగాలనుకున్నప్పటికీ రాహుల్ గాంధీ అడగలేకపోయారు.
Recommended Video


సీతారాం ఏచూరి అడిగేశారు..
ఈ నేపథ్యంలో సీపీఎం నేత సీతారాం ఏచూరి ఆ బాధ్యత తీసుకుని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శరద్ యాదవ్ను అడిగేశారు. దీంతో రైతుల సమస్యలపై తమ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని, తాను తన పార్టీ తరపునే మాట్లాడానని శరద్ యాదవ్ స్పష్టం చేశారు.

నితీష్ వ్యవహారం వల్లే..
కాగా, గతంలో పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా శరద్ యాదవ్ మాట్లాడగా, అదే పార్టీకి చెందిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మాత్రం విభేధించినట్లు ఈ సందర్భంగా కొందరు గుర్తు చేశారు. అంతేగాక, ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి కూడా నితీష్ మద్దతు పలకడంతో ఆయన ఆ
కూటమికి దగ్గరవుతున్నారని రాహుల్ గాంధీ కూడా భావించినట్లున్నారు. ఈ నేపథ్యంలోనే రాహుల్.. శరద్ యాదవ్ను ఈ ప్రశ్న అడగాలని అనుకున్నట్లు తెలుస్తోంది.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications