త్వరలో అతిపెద్ద ఆర్ధిక తుఫాన్ ..! సిద్ధమైపోండి - రాహుల్ హెచ్చరికలు..!
అమెరికా-ఇరాన్ యుద్దం నేపథ్యంలో భారత ఆర్ధిక వ్యవస్ధ ఎదుర్కొంటున్న ఇబ్బందుల కారణంగా ప్రజలు పొదుపు పాటించాలంటూ ప్రధాని మోడీ తాజాగా ఏడు సూత్రాలు ప్రకటించారు. వీటిని ప్రజలు అమల్లోకి పెట్టారో లేదో తెలియదు కానీ కేంద్రం అమల్లో పెట్టేసింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయడం ప్రారంభించేశాయి. దీంతో సామాన్యులకు షాక్ తప్పడం లేదు. ఈ నేపథ్యంలో త్వరలో ఆర్ధిక తుఫాన్ రాబోతోందని విపక్ష నేత రాహుల్ గాంధీ (rahul gandhi) హెచ్చరించారు.
మోదీజీ మార్చిన ఆర్థిక వ్యవస్థ వల్ల ఇప్పుడు ఒక ఆర్థిక తుఫాను రాబోతోందని తాను కొన్ని రోజులుగా చెబుతూనే ఉన్నానని రాహుల్ గాంధీ గుర్తుచేశారు. అదానీ, అంబానీలకు అనుకూలంగా ఆయన నిర్మించిన వ్యవస్థ నిలవదన్నారు. అది పూర్తిగా కూలిపోవడం ఖాయమన్నారు. విషాదం ఏమిటంటే, దీని భారాన్ని సామాన్య ప్రజలే మోయాల్సి వస్తుందన్నారు. వారు తమ రాజభవనాలలోనే కూర్చుంటారు, కానీ ఈ షాక్ యొక్క పూర్తి ప్రభావాన్ని అనుభవించేది యూపీ యువత, యూపీ ప్రజలే అన్నారు.

#WATCH | Raebareli, Uttar Pradesh: Lok Sabha LoP Rahul Gandhi says, "For several days now, I have been saying that the economic structure Modi ji has altered, an economic storm is coming now. The structure he has erected in favour of Adani and Ambani will not endure; it is… pic.twitter.com/rovajDbFBW
— ANI (@ANI) May 19, 2026
రాబోయే ఆర్థిక షాక్ అదానీ, అంబానీ, మోదీలను ప్రభావితం చేయదని రాహుల్ గాంధీ తెలిపారు. బదులుగా, ఇది ఉత్తర ప్రదేశ్లోని యువత, రైతులు, కార్మికులు, చిన్న వ్యాపార యజమానులను ప్రభావితం చేస్తుందని రాహుల్ హెచ్చరించారు. బహుశా చాలా సంవత్సరాలలో చూడని తీవ్రతతో ఇది విరుచుకుపడటానికి సిద్ధంగా ఉందన్నారు. ముందు చాలా కష్టకాలం ఉందన్నారు. నిర్దిష్ట చర్యలు తీసుకోవడానికి బదులుగా, నరేంద్ర మోదీ దేశాన్ని విదేశీ పర్యటనలకు వెళ్లవద్దని చెబుతున్నారు, కానీ ఆయన ప్రపంచమంతటా పర్యటిస్తున్నారని రాహుల్ ఆక్షేపించారు.












Click it and Unblock the Notifications