మోడీ తన భారత్ పర్యటనలో పంజాబ్కు వెళ్లాలి: రాహుల్ చురక
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ భారత పర్యటనకు వచ్చినప్పుడు పంజాబ్ రాష్ట్రంలో పర్యటించాలని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ బుధవారం ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రాహుల్ గాంధీ పంజాబ్లో పర్యటించి, రైతులను పరామర్శించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన బుధవారం లోకసభలో ప్రధాని, ఎన్డీయే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఇది మీ ప్రభుత్వమో లేక మా ప్రభుత్వమో కాదని, రైతులు, కూలీల ప్రభుత్వమని మండిపడ్డారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు.

మోడీని లక్ష్యంగా చేసుకొని మాట్లాడారు. ప్రస్తుతం ప్రధాని మోడీ భారత పర్యటనలో ఉన్నారని, కాబట్టి ఆయన ఇప్పుడు పంజాబ్లో పర్యటించి, రైతుల సమస్యలు తెలుసుకోవాలన్నారు. రైతుల బాధలు తెలుసుకోవాలన్నారు.
ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వం మేకిన్ ఇండియా అంటూ చెబుతోందని, రైతులు మేకిన్ ఇండియాలో లేరా అని ప్రశ్నించారు. రైతులు ఆహారం పండించడం ద్వారా మేకిన్ ఇండియాలో భాగస్వాములు కావడం లేదా అని ప్రశ్నించారు. మేకిన్ ఇండియా అని ఊదరగొడుతున్నప్పటికీ.. రైతు కంటే ఎక్కువగా ఎవరు అందులో భాగస్వాములు కాలేరని చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications