జయను పరామర్శించిన రాహుల్ గాంధీ: ఆమె సమస్యలు ఇవే !
చెన్నై: కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెన్నైలోని అపోలో ఆసుపత్రి చేరుకుని చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించారు. ఆమె ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు.
శుక్రవారం చెన్నై అపోలో ఆసుపత్రి దగ్గరకు చేరుకున్న రాహుల్ గాంధీని అపోలో ఆసుపత్రి చైర్మెన్ ప్రతాప్ సి. రెడ్డి, తమిళనాడు రాష్ట్ర మంత్రులు ఆయనను లోపలికి తీసుకువెళ్లారు. జయలలిత ఆరోగ్య వివరాలను రాహుల్ గాంధీ అపోలో వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
వూపిరితిత్తులు, ఆస్తమా, ఇన్ ఫెక్షన్, మధుమేహంకు సంబంధించి జయలలితకు చికిత్స చేస్తున్నామని వైద్యులు రాహుల్ గాంధీకి చెప్పారు. గత 15 రోజుల నుంచి శక్తివంతమైన యాంటీ బయోటిక్స్ ఇస్తున్నామని వైద్యులు తెలిపారు.
లండన్ వైద్య నిపుణుడు డాక్టర్ రిచర్డ్ జేలె నేతృత్వంలోని వైద్యులు జయలలితకు చికిత్స అంధిస్తున్నారు. సుధీర్ఘకాలం పాటు జయలలితను ఆసుపత్రిలో ఉంచి వైద్యం అంధించాలని వైద్యులు రాహుల్ గాంధీకి వివరించాని అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి.